రామ్ గోపాల్ వర్మ వద్ద శిష్యుడిగా సినీ రంగంలో పనిజేసిన అనుభవం తో దర్శకుడిగా మారిన అజయ్ భూపతి తన తోలి చిత్రం ` ఆర్ ఎక్స్ 100 ` తో సూపర్ సక్సెస్ అందుకొన్నాడు . హీరో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ జంటగా 2018లో వచ్చిన ` ఆర్ ఎక్స్ 100 ` తెలుగు నాట ఓ సంచలన విజయం నమోదు చేసుకొంది. .. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ యూత్ ని బాగా ఆకట్టు కొంది.కాగా ఈ చిత్రం హీరో కార్తికేయకు మొదటి హిట్. కాగా పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ఈ చిత్రంతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. హీరోయిన్ గా గ్లామర్ ఒలకబోస్తూ , నెగెటివ్ షేడ్స్ కలిగిన రోల్ లో పాయల్ రాజ్ ఫుట్ ప్రేక్షకుల్ని అలరించడం తో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి నిర్మాతలకు కాసుల పంట పండించింది.
కాగా ఈ చిత్ర దర్శకుడు అజయ్ భూపతి `ఆర్ ఎక్స్ 100 `కి సీక్వెల్ తీయనున్నాడని తెలుస్తోంది . ఇప్పటికే ఈ సీక్వెల్ కి సంబంధించిన కథ కూడా పూర్తి చేశాడట దర్శకుడు అజయ్ భూపతి. ప్రస్తుతం `మహా సముద్రం `అనే యాక్షన్ క్రైమ్ డ్రామాని సెట్స్ పైకి తీసుకెళ్లే పనిలో ఉన్న అజయ్ భూపతి ఈ చిత్రం పూర్తయిన అనంతరం ` ఆర్ ఎక్స్ 100 ` మూవీ సీక్వెల్ ని మొదలుపెడతాడట …
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Ajay bhupathi ready for rx 100 sequel
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com