తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్ కోలీవుడ్లో హీరోయిన్ గా బీజీగా మారింది. వరుస సినిమాలతో ఐశ్వర్య రాజేశ్ బీజీగా మారింది. తాజాగా ఐశ్వర్య రాజేష్ షూటింగ్ లోకేషన్లో నోరూరించే ఎగ్దోశ వేసి అందరినీ ఆశర్చానికి గురిచేసింది. ఐశ్వర్య దోశ వేస్తుండగా తీసిన వీడియోను ఆమె తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.
ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం కోలీవుడ్లో వరుస సినిమాలు చేస్తోంది. సతీష్ దర్శకత్వంలో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తోంది. ఈ మూవీతోపాటు తమిళంలో కా.పే రణసింగం, భూమిక, ఇదు భేతాళం సొల్లుం కథై చిత్రాల్లో నటిస్తుంది. అదేవిధంగా తెలుగులో నాని ‘టక్ జగదీష్’ మూవీలో నటిస్తుంది. ‘కౌసల్య కృష్ణమూర్తి’ మూవీలో ఐశ్వర్య రాజేష్ నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవలే విడుదలైన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీలో సువర్ణ పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలను అందుకుంది.
ఐశ్వర్య రాజేష్ పోస్టు చేసిన వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. కొందరు నెటిజన్లు ‘ఐశ్వర్య రాజేష్ మల్టి టాలెంటెడ్ అని కొడియాడుతుంటే.. మరికొందరు తన తదుపరి మూవీలో ఛెప్ గా కనిపించబోతున్నారా అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ఏదిఏమైనా షూటింగ్లో సరదాగా ఐశ్వర్య రాజేష్ వేసిన ఎగ్ దోశకు ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు.
https://www.instagram.com/tv/B9UFT8RJPgR/