కొన్ని పొరపాట్లు పెద్ద పెద్ద సంస్థల పరువును ప్రభుత్వాల గౌరవాన్ని పొగుడుతూ ఉంటాయి. అలాంటి పొరపాటే ఒకటి జరిగింది. బిహార్ విద్యాశాఖ ఇటీవల సెకండరీ టీచర్స్ ఎలిజిబులిటీ టెస్ట్ రిజల్ట్స్ ను రిలీజ్ చేసింది. ఈ ఫలితాల్లో రిషికేశ్ కుమార్ అనే వ్యక్తి 77 శాతం మార్కులను తెచ్చుకున్నాడు. అయితే అతను మంచి ఉత్తీర్ణతను సాధించినా.. స్కోర్ కార్డులో అతని ఫోటో లేదు.
పొరపాటున అతని ఫోటో పడలేదు అనుకోవచ్చు, కానీ అతని ఫోటోకు బదులుగా ఒక హీరోయిన్ ఫోటో ఉంటే దాన్ని ఏమనుకోవాలి ? అధికారుల నిర్లక్ష్యం కాదు అని ఎలా చెప్పగలం ? ఏదైనా సాంకేతిక లోపం ఉండి ఉంటే ఎవరి ఫోటో ఉండకూడదు. కానీ, ఉత్తీర్ణతను సాధించిన వ్యక్తి ఫోటో ప్లేస్ లో పని గట్టుకుని పెట్టకపోతే హీరోయిన్ ఫోటో ఎలా వస్తోంది ?
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే.. ‘అనుపమ పరమేశ్వరన్’. తన ప్లేస్ లో ఆమె ఉండటాన్ని చూసి షాకైన రిషికేశ్ కుమార్ ఈ తంతగాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారం పై అతన్ని మాటల్లోనే ‘ఈ పొరపాటు జరిగింది మొదటి సారి కాదు. నా అడ్మిట్ కార్డు పై కూడా అనుపమ ఫోటోనే వచ్చింది. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళాను కూడా.
వారు నా ఫిర్యాదు విని, దాన్ని సరిదిద్దుతామని చెప్పారు. కానీ ఎలాంటి మార్పులు చేయకపోవడంతో అదే అడ్మిట్ కార్డుతో నేను పరీక్షలు రాయాల్సి వచ్చింది. ఇప్పుడు రిజల్ట్స్ లో కూడా మళ్లీ అనుపమ ఫోటోనే రావడం, బిహార్ విద్యాశాఖ దౌర్భాగ్యం’ అని చెప్పుకొని బాధ పడ్డాడు. మొత్తానికి ఈ వ్యవహారం కాస్తా వైరల్ అయింది. దాంతో మత్తు వదిలి ఉలిక్కి పడ్డ బిహార్ విద్యాశాఖ అధికారి సంజయ్ కుమార్ ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించామని కబుర్లు చెప్పుకొచ్చారు.