సూపర్ స్టార్ రజనీకాంత్ కు అస్వస్థత అయిన విషయం తెలిసిన పవన్ కల్యాణ్ స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ట్విట్టర్ లో పేర్కొన్నారు. రజనీ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసి బాధపడ్డానని, కోవిడ్ సోకలేదని వైద్యులు చెప్పడంతో ఊరట చెందానని అన్నారు. మనోధైర్యం మెండుగా ఉన్న రజనీ త్వరగా కోలుకోవాలని కోరారు. ఆయన ఎంతో విశ్వసించే మహావతార్ బాబాజీ ఆసిస్సులతో సంపూర్ణ ఆరోగ్యవంతుడు కావాలని తెలిపారు. కాగా రజనీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని అపోలో వైద్యులు తెలిపారు. ఆయనకు హై బీపీ తప్ప మరే ఇతర సమస్యలు లేవన్నారు. బీపీ నార్మల్ స్టేజీకి రాగా డిశ్చార్జి చేస్తామన్నారు.