మనలో చాలామంది డబ్బును రెట్టింపు చేసుకోవాలని భావిస్తూ ఉంటారు. ఇందుకోసం పోస్టాఫీస్ పలు స్కీమ్స్ ను ఆఫర్ చేస్తుండటం గమనార్హం. పోస్టాఫీస్ లలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం ద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ మొత్తం రాబడిని పొందే అవకాశం అయితే ఉంటుంది. పోస్టాఫీస్ స్కీమ్స్ లో రిస్క్ కూడా ఉండదు కాబట్టి ఈ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పవచ్చు.
సుకన్య, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, మంత్లీ ఇన్కమ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్, టైమ్ డిపాజిట్, సేవింగ్స్ అకౌంట్, రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లలో ఇన్వెస్ట్ చేయవచ్చు. పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా 6.7 శాతం వడ్డీని పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు 10.75 ఏళ్లలో డబ్బులు రెట్టింపు అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.
సేవింగ్స్ అకౌంట్ లో డబ్బులు పెడితే ఆ డబ్బులు రెట్టింపు కావడానికి 18 సంవత్సరాల సమయం పడుతుంది. రికరింగ్ డిపాజిట్ స్కీమ్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే 12.41 ఏళ్లలో డబ్బులు రెట్టింపు అయ్యే అవకాశంతో పాటు 5.8 శాతం వడ్డీ లభించే అవకాశం ఉంటుంది. మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే 10.91 సంవత్సరాలలో డబ్బులు రెట్టింపు అవుతాయి. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే 9.73 ఏళ్లలో డబ్బులు డబుల్ అయ్యే అవకాశం ఉంటుంది.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ లో 10.41 సంవత్సరాలలో డబ్బులు రెట్టింపు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ స్కీమ్ పై ఏకంగా 7.1 శాతం వడ్డీ లభిస్తుండటం గమనార్హం. సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ లో 9.47 ఏళ్లలో డబ్బులు రెట్టింపు అయ్యే అవకాశాలు ఉంటాయి. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ లో 10.59 ఏళ్లలో డబ్బులు రెట్టింపు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ స్కీమ్ కు వడ్డీరేటు 6.8 శాతంగా ఉండటం గమనార్హం.
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read More