Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్2కోట్ల వ్యయంతో ఆలయాలు పునర్నిర్మాణం చేస్తున్నాం: బొత్స

2కోట్ల వ్యయంతో ఆలయాలు పునర్నిర్మాణం చేస్తున్నాం: బొత్స

శుక్రవారం ఉదయం 11:01కు సీఎం జగన్ తొమ్మిది దేవాలయాల పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. దుర్గమ్మ దర్శనం చేసుకుని, ఆలయ అభివృద్ధికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. 2కోట్ల వ్యయంతో ఆలయాలు పునర్నిర్మాణం చేస్తున్నామని పేర్కొన్నారు. మునిసిపల్ కార్పొరేషన్ ద్వారా చుట్టూ సుందరీకరణ చేస్తామన్నారు. ప్రభుత్వ నిధులతో అమ్మవారి ఆలయంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఆయన తెలిపారు. రేపు ఉదయం అమ్మవారి ఆలయంలో అభివృద్ధి కార్యక్రమాలకు 70 కోట్లతో శ్రీకారం చుట్టబోతున్నామని చెప్పారు. అందరి మనోభావాలు దృష్టిలో పెట్టుకుని జగన్ ఈ దేవాలయాల పునర్నిర్మాణం చేస్తున్నారని పేర్కొన్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular