బీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ ఎడ్సెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 10,363 మంది పరీక్షలు రాయగా 10,267 మంది ఉత్తీర్ణత సాధించారని ఆంధ్రా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రసాద్రెడ్డి తెలిపారు. ఈ మేరకు యూనివర్సిటీ ప్రాంగణంలో ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 99.07 శాతం అభ్యర్థులు ఎడ్సెట్కు అర్హత సాధించాని ఆయన తెలిపారు. మ్యాథ్స్లో 99.74, ఫిజిక్స్లో 99.41, బయోలజికల్ సైన్సెస్లో 99.03, సోషల్ స్టడీస్లో 98.37, ఇంగ్లీష్లో 98.83 శాతం అర్హత సాధించారని ప్రసాద్రెడ్డి తెలిపారు.