spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Chandragiri Yesuratnam : కూటమిని పొగుడుతున్న వైసీపీ ఎమ్మెల్సీ.. జనసేనలోకి లైన్ క్లియర్!

Chandragiri Yesuratnam : కూటమిని పొగుడుతున్న వైసీపీ ఎమ్మెల్సీ.. జనసేనలోకి లైన్ క్లియర్!

Chandragiri Yesuratnam : శాసనమండలిలో వైసీపీకి స్పష్టమైన బలం ఉంది. ఈ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది వైసీపీ. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలో దిగిన ఆ పార్టీకి.. కేవలం 11 సీట్లు మాత్రమే లభించాయి. అయితే శాసనమండలిలో ఉన్న మెజారిటీతో కూటమితో ఒక ఆట ఆడుకుందాం అని జగన్ భావించారు. కానీ వైసీపీ సభ్యులను నిర్వీర్యం చేయడం ద్వారా బలం పెంచుకోవాలని కూటమి భావిస్తోంది. ఇప్పటివరకు ఐదుగురు ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేశారు. మండలి చైర్మన్ మోషన్ రాజు వద్ద అవి పెండింగ్లో ఉండిపోయాయి. అయితే దీనిపై వారంతా న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది. అయితే ఇంతలో మరో ఎమ్మెల్సీ వైసీపీకి గుడ్ బై చెబుతారని ప్రచారం ప్రారంభం అయింది.

* అరుదైన అవకాశం ఇచ్చిన జగన్
గత ఐదేళ్లలో చాలామందికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చారు జగన్. అందుకే 38 మంది ఎమ్మెల్సీలు శాసనమండలిలో ఆ పార్టీకి ఉన్నారు. అయితే ఎన్నికలకు ముందు కొందరు రాజీనామా చేశారు. మరికొందరు చట్టసభల్లో అడుగు పెట్టారు. ఇప్పుడు పదవులకు వరుసగా రాజీనామా చేస్తున్నారు. దీంతో క్రమేపి వైసిపి బలం తగ్గుముఖం పడుతుంది. ఈ తరుణంలో మరో ఎమ్మెల్సీ జంప్ అంటూ ప్రచారం నడుస్తోంది. గుంటూరు జిల్లా గురజాలకు చెందిన చంద్రగిరి ఏసురత్నం పార్టీకి గుడ్ బై చెబుతారని పెద్ద ఎత్తున టాక్ నడుస్తోంది. 2018లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వైసీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ఇచ్చారు. ఓడిపోవడంతో ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చారు జగన్. ఆయన పదవీకాలం 2029 వరకు ఉంది.

* ఎమ్మెల్యేగా పోటీకోసమే
2029 ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందన్నది ఒక అంచనా. అప్పుడు సీట్ల సంఖ్య పెరుగుతుందని.. తప్పకుండా తనకు పోటీ చేసే ఛాన్స్ వస్తుందని ఏసురత్నం భావిస్తున్నారు. అందుకే జనసేనలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగానే జనసేనలోకి వెళ్తే.. ఎన్నికల్లో పోటీకి పవన్ ఎలాగైనా అవకాశం ఇస్తారని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఏసు రత్నం తీరులో కూడా మార్పు వచ్చింది. తరచూ కూటమి పాలనను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే అనుచరులకు కూడా స్పష్టతనిచ్చినట్లు తెలుస్తోంది. అదే నిజమైతే మాత్రం వైసీపీకి మరో షాక్ తప్పేలా లేదు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper