spot_img
Homeఆంధ్రప్రదేశ్‌YS Sharmila: జగన్ ను కలవర పెడుతున్న షర్మిల సంచలన నిర్ణయం

YS Sharmila: జగన్ ను కలవర పెడుతున్న షర్మిల సంచలన నిర్ణయం

YS Sharmila: వైఎస్ షర్మిల ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయంగా తేలుతోంది. ఎన్నికల్లో ఆమె కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా దీనిపై ప్రచారం జరుగుతున్నా.. ఈరోజు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.కడప జిల్లా కాంగ్రెస్ నేతలతో ఈరోజు షర్మిల సమీక్షించనున్నారు. ఈ సమావేశం అనంతరం కడప ఎంపీ సీటు విషయంలో తన నిర్ణయాన్ని షర్మిల ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. ఒకవేళ షర్మిల కడప ఎంపీగా పోటీ చేస్తే రాష్ట్ర రాజకీయాల్లో.. సమీకరణలు శరవేగంగా మారనున్నాయి.దీంతో అందరి దృష్టి ఆమె నిర్ణయం పై ఉంది.

కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని షర్మిలపై అధిష్టానం నుంచి ఒత్తిడి ఉంది. రాహుల్ గాంధీ తన జోడోయాత్ర సందర్భంగా ఇదే విషయంపై షర్మిల తో మాట్లాడినట్లు తెలుస్తోంది. కడప జిల్లాలో రాజకీయం మార్చితే ఆ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా మారుతుందని.. కాంగ్రెస్ ఉనికి ప్రారంభమవుతుందని పార్టీ హై కమాండ్ పెద్దలు ఆశిస్తున్నారు. అందుకే షర్మిలను పట్టు పట్టి మరి కడప నుంచి బరిలో దించాలని చూస్తున్నారు. గతంలో ఆమె ఎన్నడు ప్రత్యక్ష ఎన్నికల్లో దిగలేదు. తండ్రి రాజశేఖర్ రెడ్డి ఉన్నంతవరకు ఆ అవసరం రాలేదు. రాజకీయాల వైపు చూడలేదు. కానీతన సోదరుడు రాజకీయంగా కష్టకాలంలో ఉండగా షర్మిల అండగా నిలబడ్డారు.పాదయాత్ర చేశారు. ప్రజల్లోకి వెళ్లారు. ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో దిగనుండడంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కడప జిల్లాలో డిఎల్ రవీంద్ర రెడ్డి లాంటి సీనియర్లను సమావేశానికి ఆహ్వానించారు. వారి నుంచి అభిప్రాయాలు సేకరించాక తన నిర్ణయాన్ని వెల్లడించనున్నారు.

ఒకవేళ షర్మిల కడప ఎంపీ సీటుకు పోటీ చేస్తే రాజకీయంగా వైసిపికి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. పార్లమెంట్ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లలో దాని ప్రభావం పడనుందని తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. విపక్షాలన్నీ కూటమి కట్టాయి. కడప జిల్లాలో సైతం పట్టు బిగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో షర్మిల పోటీ చేస్తే విపక్షాలకు అస్త్రంగా మారే అవకాశం ఉంది. అవసరమైతే కడప పార్లమెంట్ స్థానం పరిధిలో విపక్షాలన్నీ షర్మిలకు మద్దతు తెలిపే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజకీయాలకు అతీతంగా జగన్ పాలనపై రెఫరండంగా షర్మిల పోటీకి దిగితే మాత్రం విపక్షాలన్నీ మద్దతు తెలిపే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

కడప జిల్లాలో వైయస్ కుటుంబానికి మంచి పట్టు ఉంది.నాలుగు దశాబ్దాలుగా ఆ జిల్లాలో రాజశేఖర్ రెడ్డి కుటుంబం పట్టు నిలుపుకుంటూ వస్తోంది. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ మారింది. తల్లి విజయమ్మ, సోదరి షర్మిల రాజకీయంగా విభేదించడం ప్రారంభించారు. వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో కుటుంబంలో అడ్డగోలుగా చీలిక వచ్చింది. దీంతో కుటుంబ చరిత్ర మసకబారింది. ఆ కుటుంబ అభిమానుల్లో సైతం ఒక రకమైన అసంతృప్తి కనిపిస్తోంది. ఇప్పుడు గాని షర్మిల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే.. కుటుంబ అభిమానులు ఎక్కువగా ఆమె వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. మరోవైపు వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి జగన్ తిరిగి టికెట్ ఇచ్చారు. ఇది కూడా ఇబ్బందికర పరిణామమే. మొత్తానికి అయితే షర్మిల ఈరోజు తీసుకునే నిర్ణయం.. ఏపీ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలకనుంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper