Homeఆంధ్రప్రదేశ్‌YCP MLCs : అక్కడ టిడిపికి సహకరిస్తున్న వైసీపీ ఎమ్మెల్సీలు

YCP MLCs : అక్కడ టిడిపికి సహకరిస్తున్న వైసీపీ ఎమ్మెల్సీలు

YCP MLCs :  ఏపీలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. శాసనసభకు విపక్ష వైసిపి డుమ్మా కొడుతోంది. కానీ శాసనమండలిలో మాత్రం సత్తా చాటుతోంది. శాసనమండలిలో విపక్ష నేతగా బొత్స సత్యనారాయణ ఉన్నారు. మండలి చైర్మన్ గా వైసీపీకి చెందిన మోసేన్ రాజు ఉన్నారు. అందుకే బలమున్న శాసనమండలిలో వైసిపి తన వాయిస్ బలంగా వినిపిస్తోంది. కానీ కొందరు ఎమ్మెల్సీల తీరు మాత్రం అనుమానంగా ఉంది. వారు టిడిపి తో కుమ్మక్కయ్యారా అన్న అనుమానం కలిగే లా ఉంది. ఈ ఎన్నికల్లో వైసిపి దారుణంగా ఓడిపోయింది. 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యింది. కనీసం ప్రతిపక్ష హోదా దక్కలేదు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతామని జగన్ చెబుతున్నారు. శాసనమండలిలో మాత్రం బలం ఉండడంతో పాటు చైర్మన్, ప్రతిపక్ష హోదా ఉండడంతో సభ్యులు హాజరవుతున్నారు. కానీ ఆశించిన స్థాయిలో వైసీపీ సభ్యులు మాట్లాడడం లేదని జగన్లో ఒక రకమైన అనుమానం కలుగుతున్నట్లు తెలుస్తోంది.

* టిడిపికి అవకాశం ఇచ్చిన బొత్స
రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఎమ్మెల్సీలు నిలదీస్తారని జగన్ ఆశించారు. కానీ మండలిలో విపక్ష నేత బొత్స మాత్రం తప్పు ఒప్పుకున్నట్లు మాట్లాడారు. నారా లోకేష్ తల్లిపై అనుచితంగా మాట్లాడిన వారిని ప్రోత్సహించబోమని ఆయన అన్నారు. అయితే టిక్కెట్లు ఇచ్చారు కదా అని లోకేష్ మండి పడ్డారు.వెంటనే అంబటి రాంబాబు నుంచి రిప్లై వచ్చింది. మీ తల్లి గారిని అవమానించినట్లుగా నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించారు. వెంటనే జగన్ ఆనాడు స్పందించిన తీరుకు సంబంధించి వీడియోలు బయటకు వచ్చాయి. సోషల్ మీడియాలో కనిపించడంతో నాడు జగన్ రాక్షసానందం పొందినట్టు బయటపడింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇదంతా మండలిలో బొత్స ఫెయిల్ కారణంగానే వచ్చిందని వైసీపీలో అనుమానాలు ప్రారంభమయ్యాయి.

* జగన్ అసహనం
అధికారం కోల్పోయిన తొలినాళ్లలో జగన్ ఎమ్మెల్సీలపై ధీమాతో ఉండేవారు. మండలిలో బలం ఉంది కనుక ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులను అడ్డుకుందామని ధీమా వ్యక్తం చేశారు. అయితే మండలిలో వైసీపీ సభ్యుల తీరు చూస్తుంటే మాత్రం అది సాధ్యమయ్యే పని కాదని తెలుస్తోంది. ఒకరిద్దరు ఎమ్మెల్సీలు తప్ప… అంతా ప్రభుత్వానికి సరెండర్ అయ్యారన్న అనుమానాలు ఉన్నాయి. ఓ నలుగురు ఎమ్మెల్సీలు పదవులకు రాజీనామా చేస్తే మండలి చైర్మన్ వాటిని ఆమోదించలేదు. ఇప్పుడున్న వారిలో సైతం చాలామంది అసంతృప్తితోనే ఉన్నారు. పక్క చూపులు చూస్తున్నారు. కూటమి నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో వైసీపీలోనే సైలెంట్ గా గడుపుతున్నారు. దీంతో జగన్ ఇచ్చిన టాస్క్ ను పూర్తి చేయలేకపోతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular