Homeఆంధ్రప్రదేశ్‌Duvvada Srinivasa Rao : ఓపెన్ అయిపోయిన దువ్వాడ శ్రీనివాస్.. తిరుమలలో మాధురి తో కలిసి...

Duvvada Srinivasa Rao : ఓపెన్ అయిపోయిన దువ్వాడ శ్రీనివాస్.. తిరుమలలో మాధురి తో కలిసి ఏం చేశాడంటే

Duvvada Srinivasa Rao :  తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ వివాదం ఒక రేంజ్ లో రచ్చ చేసింది. ఒక సీరియల్ ఎపిసోడ్ లా మారింది. తెలుగు మీడియాకు అదే ప్రధాన వనరుగా మారిపోయింది. విజయవాడ వరదలు సంభవించిన వరకు అదే ప్రధాన వార్తగా నిలిచింది. తన భర్త వేరే మహిళతో సన్నిహితంగా ఉంటున్నారని ఆరోపిస్తూ దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి తన ఇద్దరు పిల్లలతో కలిసి.. దువ్వాడ నూతన గృహంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు.అక్కడ నుంచి రచ్చ ప్రారంభమైంది. మధ్యలో దువ్వాడ శ్రీనివాస్ సన్నిహితురాలు మాధురి ఎంట్రీ ఇచ్చారు. దువ్వాడతో తనకు ఉన్న సంబంధాలపై రకరకాలుగా మాట్లాడారు. ఎన్నికల ముందు నుంచి దువ్వాడతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తొలుత దువ్వాడ వాణి వైఖరితోతాను ఇబ్బంది పడ్డానని.. నడి వీధిలోకి వచ్చానని చెప్పుకొచ్చారు మాధురి.తరువాత దువ్వాడ శ్రీనివాస్ కు అప్పు ఇచ్చానని.. అప్పులో భాగంగా ఆ ఇంటిని స్వాధీనం చేసుకుంటున్నానని చెప్పుకొచ్చారు. దీంతో వివాదం మరింత పెరిగింది. చివరకు దువ్వాడ శ్రీనివాస్ ఆ రెండు కోట్ల అప్పుకు బదులు ఇంటిని మాధురి పేరుతో రాశారు. దీంతో వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. అదే ఇంట్లో ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ తో పాటు మాధురి ఉంటున్నారు. ఇద్దరూ సహజీవనం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో దువ్వాడ శ్రీనివాస్, మాధురీలు తిరుమలలో ప్రత్యక్షం కావడం విశేషం.

* లక్షలాదిమంది భక్తులు ఉండగా
ప్రస్తుతం తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.లక్షలాదిమంది భక్తులు తరలివస్తున్నారు.సరిగ్గా ఇటువంటి క్రమంలోనే దువ్వాడ శ్రీనివాస్,మాధురి తిరుమలలో కనిపించారు.అటు మీడియా సైతం వారికి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చింది.దువ్వాడ శ్రీనివాస్ వెంట అనుచరులు,కొంతమంది వైసీపీ నేతలు సైతం ఉన్నారు.అయితే దాదాపు భార్య మాదిరిగానే ఆమె తిరుమలలో శ్రీనివాస్ వెంట ఉండడం కనిపించింది.

* బుల్లితెరపై సందడి చేస్తూ
ఇటీవలే దువ్వాడ శ్రీనివాస్ హీరోగా వాలంటీర్ అనే సినిమాను రూపొందించారు మాధురి.దానిని యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేశారు. మధ్యలో స్కూటీపై ఆ జంట కనువిందు చేస్తూరూపొందించిన రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతంవారిద్దరూ కొత్త ఇంట్లో ఏకాంతంగా గడుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.దానిని నిజం చేసేలాఆ ఇద్దరు సన్నిహితులు రీల్స్ చేస్తూ కనిపించడం విశేషం. ఇప్పుడు ఏకంగా తిరుమల శ్రీవారి సన్నిధిలో సైతం ప్రత్యేక పూజలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. దువ్వాడ వాణి విడాకులు ఇస్తే తాము పెళ్లి చేసుకుంటామని ఇది వరకే మాధురి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వీరి బంధం పై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular