spot_img
Homeఆంధ్రప్రదేశ్‌AP Elections 2024: ఏపీలో గాలి ఎటువైపు వీస్తోంది

AP Elections 2024: ఏపీలో గాలి ఎటువైపు వీస్తోంది

AP Elections 2024: తెలంగాణ ఎన్నికలు ముగిసాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. బిఆర్ఎస్ అంచనాలు తప్పాయి. ఇప్పుడు అందరి దృష్టి ఏపీ పై పడింది. విజేత ఎవరు అన్నది తేలాల్సి ఉంది. అయితే ఈసారి ఫైట్ హోరా హోరీగా నడవనుంది. విజయం అంత సులువుగా దక్కే పరిస్థితి కనిపించడం లేదు. ఎవరికి వారు ధీమా కనబరుస్తున్నా లోలోపల మాత్రం గుబులు రేగుతోంది.

గత ఎన్నికల్లో వైసిపి అంతులేని మెజారిటీతో విజయం సాధించింది. జగన్ సీఎం చేయాలని ప్రతి వైసీపీ కార్యకర్త సైనికుడిలా పని చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ ప్రభుత్వం వస్తుందని భావించి జగన్కు ఏకపక్షంగా మద్దతు తెలిపారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? జగన్ ను మరోసారి సీఎం చేయాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయా? ఉద్యోగ, ఉపాధ్యాయులు అనుకుంటున్నారా? అంటే మాత్రం సమాధానం లేదు. గతసారికలిసి వచ్చిన వర్గాల్లో.. ఒక్కటి కూడా వైసీపీతో లేదు. ఒక్క సంక్షేమ పథకాల లబ్ధిదారులు మాత్రం కొంత సానుకూలంగా ఉన్నారు. అయితే వాడు కూడా ఓటు వేస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.

ఏపీలో అర్బన్ ఓటర్లు మాత్రం జగన్ ను వద్దనుకుంటున్నారు. గ్రామీణ వాటర్ లు మాత్రం స్తబ్దతగా ఉన్నారు. మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వ విధానాలపై విసుగు చెంది ఉన్నారు. దీంతో వీరంతా ప్రత్యామ్నాయం వైపు ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు వరకు సమ్మతి లేకున్నా.. కొత్తగా పవన్ జతకట్టడంతో ఆ కూటమి వైపు చూస్తున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. సమాజంతో మాకేంటి? మాకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయా? లేదా? అన్న పేద వర్గాలు మాత్రం మరోసారి జగన్ అధికారంలోకి రావాలని బలంగా కోరుకుంటున్నాయి.అయితే అదే స్థాయిలో ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ధరల పెరుగుదల, చార్జీలు, పన్నుల పింపును తప్పు పడుతున్నాయి. వారిని నియంత్రించాల్సిన వైసీపీ సైన్యం మునుపటిలా పనిచేయడం లేదు. ఈ అసంతృప్తి పెరిగితే మాత్రం వైసిపికి కష్ట కాలమే.

రాజకీయంగా ఇప్పుడు వైసీపీకి సంధి కాలం. పార్టీ అభ్యర్థులను మార్చి మరోసారి విజయం అందుకోవాలని జగన్ భావిస్తున్నారు. అటు నాయకులు తమకు అన్యాయం జరిగితే పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తామని సంకేతాలు పంపుతున్నారు. ఇలా ఎలా చూసినా వైసీపీకి ఇబ్బందికరమే. అయితే టిడిపి, జనసేన పొత్తుతో ఒక రకమైన సహృద్భావ వాతావరణం ఏర్పడింది. ప్రత్యామ్నాయం మేమే అన్న రీతిలో ఆ రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయి. అయితే అది దిగువ స్థాయి నేతల్లో వర్కౌట్ అయితేనే ఫలితం ఉంటుంది. టికెట్ ఏ పార్టీకి వచ్చిన ఓట్ల బదలాయింపు జరిగితే దానికి సార్ధకం చేకూరుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న కొలది జగన్కు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుండగా.. కూటమికి అనుకూల వాతావరణం ఏర్పడుతోంది. సీట్ల సర్దుబాటు తో పాటు ప్రజలను ఆకర్షించే విధానాలతో ముందుకెళితే మాత్రం టిడిపి, జనసేన కూటమి విజయం వైపు అడుగులు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రాజకీయంగా జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇవి వికటించే పరిస్థితి కనిపిస్తోంది. గత రెండు ఎన్నికల్లోనమ్మకస్తులుగా భావించిన నాయకులకు జగన్ టికెట్లు ఇచ్చారు. ఈసారి మొండి చేయి చూపుతున్నారు. వారంతా ఎదురు తిరగడంతోపాటు ప్రత్యర్థికి సాయం అందిస్తే మాత్రం జగన్ చిక్కుల్లో పడినట్టే. మరీ ముఖ్యంగా జనాలను ఆకర్షించే విషయంలో టిడిపి, జనసేనలు ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తే సత్ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ప్రభుత్వం పై ప్రజా వ్యతిరేకత పెరిగిన నేపథ్యంలో.. దానిని క్యాష్ చేసుకుంటే మాత్రం కూటమికి తిరుగులేదు. అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కూటమి వైపు మొగ్గుచూపితే.. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక వర్గాలను ఏకతాటిపైకి తీసుకువచ్చే అవకాశం కలుగుతుంది. వైసిపి ప్రభుత్వానికి బాహటంగావ్యతిరేకించేవారు ఈ కూటమి వైపు టర్న్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Donald Trump

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...
David Warner

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...
Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...
Chandrababu And Lokesh

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...
Suvendu Adhikari

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
Oktelugu Epaper