Homeఆంధ్రప్రదేశ్‌Vijayasai Reddy: వాస్తవాలు తెలుసుకో జగన్.. విజయసాయిరెడ్డి కర్తవ్య బోధ!

Vijayasai Reddy: వాస్తవాలు తెలుసుకో జగన్.. విజయసాయిరెడ్డి కర్తవ్య బోధ!

Vijayasai Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress ) మాజీ నేత విజయసాయిరెడ్డి మనసులో ఏముందో అర్థం కావడం లేదు. ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్లి జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇస్తున్నారు. మారాలని హితబోధ చేస్తున్నారు. మారితే తప్ప భవిష్యత్తు లేదని తేల్చి చెప్తున్నారు. దీంతో విజయసాయిరెడ్డిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సతమతమవుతున్నాయి. అయితే సహజంగానే ఈ సలహాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి విమర్శలుగా ఉంటాయి. అందుకే విజయసాయిరెడ్డిని వారు టార్గెట్ చేసుకుంటున్నారు. అయితే ఎవరి పైన అయితే విజయసాయిరెడ్డి విమర్శలు చేస్తున్నారు.. వారు అస్సలు స్పందించడం లేదు. ఇతర నేతలతో మాట్లాడించి విజయసాయిరెడ్డి నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలు ఏవి వర్కౌట్ కావడం లేదు. తాజాగా రాజరికపు పాలన, రాజుగారి వ్యవహార శైలి, చుట్టూ కోటరి, దాని వల్ల కలిగే అనర్ధాలు గురించి ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి.

Also Read:  కూటమికి ‘రుషికొండ’ అస్త్రం.. చేజేతులా అందించిన జగన్మోహన్ రెడ్డి!

 

* రాజకీయాలు మాట్లాడను అంటూనే..
ఈ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా రాలేదు. ఒక్కో నేత పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఈ క్రమంలో తొలుత సైలెంట్ అయ్యారు విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy ). వన్ ఫైన్ మార్నింగ్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పదవులకు సైతం రాజీనామా చేశారు. రాజ్యసభ పదవిని సైతం వదులుకున్నారు. ఇకనుంచి రాజకీయాలు మాట్లాడనని తేల్చి చెప్పారు. వ్యవసాయం చేసుకుంటానని కూడా చెప్పుకొచ్చారు. కొద్దిరోజులపాటు అలానే చేశారు. కానీ క్రమేపి వాయిస్ పెంచుతున్నారు. నేరుగా జగన్మోహన్ రెడ్డి పై కాకుండా.. చుట్టూ ఉన్న కోటరీ పై విమర్శలు చేశారు. ఇప్పుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇస్తున్నారు.

* జగన్మోహన్ రెడ్డికి సూచనలు..
తాజాగా విజయసాయిరెడ్డి ఒక ట్వీట్ ( tweet) చేశారు. గతంలో రాజ్యాలు ఉండేవని.. రాజ్యానికి రాజులు ఉండేవారని.. రాజులు రాజమండ్రిలో గడిపే వారిని.. రాజు చుట్టూ కోటరీ ఉండేదని.. రాజ్యంలో ప్రజలు పడే ఇబ్బందులు రాజుకు తెలిసేవి కావని.. కానీ ప్రజలు తిరుగుబాటు చేసి రాజులతో పాటు రాజరికపు పాలనను ముగించారని తన ట్వీట్ లో చెప్పుకొచ్చారు విజయసాయిరెడ్డి. తద్వారా చుట్టూ ఉన్న కోటరీని నమ్ముకోవద్దని సలహా ఇచ్చారు. రాజు తెలివైనవాడు అయితే మారువేషంలో ప్రజల్లోకి వచ్చి నిజాలు తెలుసుకుంటాడని.. కోటరీ అడ్డుగోడలు తొలగించుకుంటాడని చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి అలా చేస్తే తప్ప వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలబడదని అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular