spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Vijayasai Reddy: విజయసాయిరెడ్డి అవసరం జగన్ కు అనివార్యం!

Vijayasai Reddy: విజయసాయిరెడ్డి అవసరం జగన్ కు అనివార్యం!

Vijayasai Reddy: గత కొద్ది నెలలుగా జగన్మోహన్ రెడ్డి కేంద్ర పెద్దలను కలిసేందుకు చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్లు లభించడం లేదు. వై వి సుబ్బారెడ్డి చేస్తున్న ప్రయత్నాలు ఏవి ఫలించడం లేదు. పొలిటికల్ కన్సల్టెంట్లు, మధ్యవర్తుల సాయంతో ఢిల్లీ లాబీయింగ్ నడుపుతున్నారు. కానీ ఆ ప్రయత్నాలు ఏవి ఫలించడం లేదు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆందోళనతో ఉన్నారు.

* ఢిల్లీకి దగ్గరగా వైసిపి..
ప్రాంతీయ పార్టీలకు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ కీలకం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో మాత్రం సక్సెస్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటయింది. కాంగ్రెస్ పార్టీకి బద్ధ విరోధిగా మారింది. అలా కాంగ్రెస్కు విరోధి అయిన బిజెపి వైసీపీ విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తూ వచ్చింది. అయితే దానికి మూల కారకుడు మాత్రం విజయసాయిరెడ్డి. ఢిల్లీ నెట్వర్కింగ్ లో విజయసాయి రెడ్డికి ప్రత్యేకమైన శైలి ఉండేది. పొలిటికల్ అప్రోచ్ సాధించడంలో ఆయన అంది వేసిన చెయ్యి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు జగన్మోహన్ రెడ్డి ప్రయోజనాల కోసం అంకితభావంతో పనిచేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కార్యాలయాలతో నేరుగా నిరంతరం టచ్ లో ఉంటూ.. జగన్ కోరిన మరుక్షణం వారి అపాయింట్మెంట్ ఇప్పించేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు. వైవి సుబ్బారెడ్డి చేసే ప్రయత్నాలు ఎప్పటికప్పుడు ఫెయిలవుతుండడంతో జగన్మోహన్ రెడ్డి ఆందోళనతో ఉన్నారు.

* అప్పట్లో చాలా సులువుగా..
2014లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉండేది. టిడిపి అధికారంలోకి వచ్చింది. ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా చేరింది. ఆ సమయంలో సైతం జగన్మోహన్ రెడ్డికి కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ లభించేది. దానికి ముమ్మాటికి కారణం విజయసాయిరెడ్డి. ఆయన వ్యక్తిగతంగా నెట్వర్క్ పెంచుకోవడంతో పాటు రాజకీయ పరిస్థితులకు తగ్గట్టు లాబీయింగ్ నడపగలరు. విజయసాయిరెడ్డి ఇప్పుడు లేకపోవడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు జగన్మోహన్ రెడ్డికి లోటు. గత కొన్ని నెలలుగా ప్రధాని మోదీ, అమిత్ షాల అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. కానీ అవి ఫలించలేదు. అదే విజయసాయి రెడ్డి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని సొంత పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కొందరైతే మళ్ళీ విజయసాయిరెడ్డిని దగ్గరకు చేర్చుకుంటేనే జగన్మోహన్ రెడ్డికి ప్రయోజనం అని తేల్చి చెబుతున్నారు. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వంలో రోజురోజుకు చంద్రబాబు కీలకంగా మారిపోతున్నారు. ఇటువంటి సమయంలో ఢిల్లీ తలుపులు మరింత సవాలుగా మారుతున్నాయి. ఢిల్లీ స్థాయిలో బలమైన వ్యూహాలు అమలు చేయగల సమర్థత ఉన్న విజయసాయిరెడ్డి అవసరం ఇప్పుడు జగన్ కు ఉంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Bhogapuram International Airport

Bhogapuram International Airport: భోగాపురం విమానాశ్రయం ప్రారంభం.. విద్యార్థులకు బంపర్ ఆఫర్!

Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జాతికి అంకితం కానుంది. ఈనెల 1న ప్రారంభోత్సవానికి నోచుకోనుంది. అందుకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు....
Balakrishna

Balakrishna: బాలయ్య కి ఫోన్ చేసిన ఎన్టీఆర్… ఇంటికి కూడా వెళ్తున్నాడుగా…

Balakrishna: సినిమా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ ఉన్నంత మాత్రాన సక్సెసులైతే రావు... స్టార్ డమ్ అనేది లభించదు. వాళ్ల సత్తాను చూపించి ప్రేక్షకులను మెప్పించగలిగితేనే వాళ్ళకంటూ ఒక ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. లేకపోతే మాత్రం...
Talliki Vandanam Scheme

Talliki Vandanam Scheme: తల్లికి వందనం అందలేదా.. ఇలా చేయండి!

Talliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది వరకు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలు జమ కానున్నాయి....
CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Oktelugu Epaper