Tamil Nadu leader comments on Chandrababu: తమిళనాడు రాజకీయాలు ఏపీపై ప్రభావం చూపుతున్నాయి. అక్కడి విజయ్ గెలుపులో ఇక్కడి జగన్ ఉన్నారు అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రచారం చేసుకుంటున్నాయి. వారిద్దరూ ప్రాణమిత్రులని.. అందుకే విజయ్ ఎన్నికల ప్రచారంలో జగన్ ఫోటోను వాడుకున్నారని.. విజయ్ గెలుపు వెనుక జగన్ ఉన్నారని భారీ స్థాయిలో ఎలివేషన్లు ఇచ్చి ప్రచారం చేసుకుంటోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల విశ్లేషకులు సైతం దీనిని తప్పుపడుతున్నారు. అంత బలం ఉంటే ఏపీలోనే ప్రతిపక్ష హోదాకు అవసరమైన సంఖ్యాబలం తెచ్చుకో లేకపోయారు కదా అని ఎద్దేవా చేస్తున్నవారు కూడా ఉన్నారు. ఇటువంటి క్రమంలో టీవీ కే ఎమ్మెల్యే ఒకరు బాహటంగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరును తప్పు పట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు తమిళనాడులో డీఎంకే ఓటమిని ఏపీతో పోల్చుతూ కొందరు రాజకీయ నాయకులు చేస్తున్న విశ్లేషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అంశంగా మారింది.
పిఎంకె అధ్యక్షుడి ప్రశంస..
తమిళనాడు కు చెందిన పిఎంకె అధ్యక్షుడు అన్బూమణి ఇంటర్వ్యూలో మాట్లాడారు. తమిళనాడులో డిఎంకె ఓటమిపై విశ్లేషించారు. తమిళనాడు సీఎం గా స్టాలిన్, డిప్యూటీ సీఎం గా ఉదయనిది స్టాలిన్ వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే వారి హయాంలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు చేశారు. పరిశ్రమలను తేవడంలోనూ, పెట్టుబడులను ఆకర్షించడంలోనూ తండ్రీ కొడుకులిద్దరూ ఫెయిల్ అయ్యారని రామదాసు విమర్శించారు. అదే సమయంలో ఏపీకి పరిశ్రమలు క్యూ కడుతుండడాన్ని గుర్తు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు తో పాటు ఆయన కుమారుడు మంత్రి లోకేష్ ఎంతో కష్టపడి పని చేస్తున్నారని.. పారదర్శకమైన పాలన అందిస్తున్నారని.. అందుకే పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని గుర్తు చేస్తూ సాగిన ఈ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పారదర్శకమైన పాలనకు కితాబు…
ఒకవైపు తమిళనాడులో విజయ్ గెలుపు లో భాగస్వామ్యం కోరుకుంటుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కనీసం సంబంధమే లేని పార్టీ విజయాన్ని ఇక్కడ సంబరాల రూపంలో జరుపుకుంటుంది. అదే సమయంలో అక్కడి రాజకీయ పార్టీ నేత.. ఇక్కడి ప్రభుత్వ చర్యలను అభినందిస్తున్నారు. పరిశ్రమల ఏర్పాటుతో పాటు పెట్టుబడులను ఆకర్షించడంలో చంద్రబాబు, లోకేష్ చేసిన కృషిని అభినందిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అన్బూమణి రామదాస్ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.