spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Peddireddy Family: వైసీపీలో ఆ ఫ్యామిలీ ఫుల్ సైలెన్స్!

Peddireddy Family: వైసీపీలో ఆ ఫ్యామిలీ ఫుల్ సైలెన్స్!

Peddireddy Family: గత కొంతకాలంగా పెద్దిరెడ్డి ఫ్యామిలీ పొలిటికల్ గా సైలెంట్ గా ఉంది. అయితే మద్యం కుంభకోణంలో పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి బెయిల్ పై విడుదలైన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డిని నేరుగా కలవలేదు. పెద్దిరెడ్డి ఫ్యామిలీ అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడిచింది. కానీ తరువాత అటువంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా.. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పార్లమెంట్లో గట్టిగానే మాట్లాడారు కూటమి ప్రభుత్వంపై. కానీ ఇటీవల క్షేత్రస్థాయిలో పెద్దిరెడ్డి ఫ్యామిలీ, వైసీపీలో యాక్టివ్గా కనిపించడం లేదు. తాడేపల్లి కార్యాలయంలో సైతం పెద్దగా జాడలేదు. ఈ పరిస్థితుల్లో పెద్దిరెడ్డి ఫ్యామిలీ అసంతృప్తితో ఉందన్న ప్రచారం రోజురోజుకు పెరుగుతోంది. ఒకానొక దశలో ఆ ఫ్యామిలీ బిజెపిలో చేరుతుందన్న ప్రచారం కూడా నడిచింది. కానీ అందులో వాస్తవం లేకపోవచ్చు కానీ.. ఆ ఫ్యామిలీ అసంతృప్తితో ఉందన్న మాట మాత్రం వాస్తవం. జగన్ వెంట పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లేకపోవడం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దగా కనిపించకపోవడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.

* పలకరించని జగన్..
మద్యం కుంభకోణంలో అరెస్టయ్యారు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి. చాలా రోజులపాటు ఆయన జైల్లోనే ఉండిపోయారు. అయితే విజయవాడతో పాటు వివిధ నగరాల్లో జైల్లో ఉండే వైసీపీ నేతలను జగన్మోహన్ రెడ్డి పరామర్శించేవారు. కానీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విషయంలో మాత్రం దూరంగా ఉండిపోయారు. మిథున్ రెడ్డికి బెయిల్ రాకపోవడంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం రాజమండ్రిలోనే గడపాల్సి వచ్చింది. ఆ సమయంలో సంఘీభావం కూడా జగన్మోహన్ రెడ్డి నుంచి రాకపోవడం ఆ ఫ్యామిలీలో అసంతృప్తికి కారణంగా మారింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు జగన్మోహన్ రెడ్డి కోసం తాము ఎంతగానో కృషి చేస్తే.. తాము కష్టంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి అండగా నిలవకపోవడంపై వారు ఆవేదనతో ఉన్నట్లు తెలుస్తోంది. మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన వారు బెయిల్ పై బయటకు వచ్చాక నేరుగా జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. కానీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి మాత్రం అలా కలవలేదు. దీంతో అప్పట్లోనే తెగ ప్రచారం నడిచింది ఆ ఫ్యామిలీ అసంతృప్తితో ఉందని.

* చుట్టూ కేసులు..
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూ కూడా అనేక కేసులు తిరుగుతున్నాయి. వివాదాలు నడుస్తున్నాయి. పైగా కూటమి ప్రభుత్వం పెద్దిరెడ్డి పై దూకుడు మీద ఉంది. దానికి కారణం లేకపోలేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు.. సీనియర్ మంత్రిగా ఉండేవారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాయలసీమ రాజకీయాలు ఆయన కనుసన్నల్లో నడిచేవి. కుప్పంలో చంద్రబాబును ఓడించేందుకు ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. చివరకు చంద్రబాబును సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టనీయకుండా పెద్దిరెడ్డి పెద్ద ప్రయత్నాలు చేశారు. హిందూపురంలో బాలకృష్ణను ఓడించేందుకు ఆయన చేయని ప్రయత్నం లేదు. మరోవైపు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు చాలా రకాల విన్యాసాలు చేశారు. అప్పట్లో రాయలసీమ నుంచి పిఠాపురం నియోజకవర్గానికి మనుషులను తెప్పించారని కూడా పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఇంతలా అప్పట్లో రాజకీయాలను ప్రభావితం చేశారు ఆ తండ్రి కొడుకులు. అందుకే ఇప్పుడు కూటమికి టార్గెట్ అయ్యారు. కానీ జగన్మోహన్ రెడ్డి నుంచి మాత్రం అంతగా ఆదరణ దక్కకపోవడంతో వారు ఆవేదనతో ఉన్నట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పరు కానీ.. వారు మాత్రం అసంతృప్తితో ఉన్నారన్నది మాత్రం వైసిపి వర్గాల్లో వినిపిస్తున్న మాట.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Men's Mental Health

men’s health : మగవాళ్లు చెప్పుకోలేని ఐదు సమస్యలున్నాయి.. అవేంటో తెలుసా..

men's health : ‘నువ్వు మగాడివి బాస్.. ధైర్యంగా ఉండాలి.. కుటుంబానికి అండగా ఉండాలి..’అని చాలా మంది చెబుతూ ఉంటారు. ఒక కుటుంబంలో ఎవరికి సమస్య వచ్చినా వాటి పరిష్కారానికి తీవ్ర కృషి...

body fat : కొవ్వుతో మెదడుపై ప్రభావం.. ఎలాగో తెలిస్తే షాక్ అవుతారు..

body fat : ప్రస్తుత కాలంలో చాలామంది రకరకాల ఆహారాన్ని తింటూ ఉన్నారు. ముఖ్యంగా ఆయిల్ ఎక్కువగా ఉండే ఫుడ్ తో పాటు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో అదనపు...

Wrong Mobile Recharge : తప్పుడు నెంబర్కు రీఛార్జ్ చేశారా.. ఇలా చేస్తే మనీ రిఫండ్..

Wrong Mobile Recharge : మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎవరికి వారే రీఛార్జ్ చేసుకుంటూ ఉంటున్నారు. అయితే ఈ క్రమంలో ఒక్కోసారి తప్పుడు నెంబర్ పై రీఛార్జ్ అయ్యే అవకాశం...

IBPS PO 2026 : బ్యాంకు ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్‌.. 7,460 ఉద్యోగాలకు మరో ఛాన్స్‌!

IBPS PO 2026 : ఐబీపీఎస్‌(ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌) పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్‌(పీవో), స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌(ఎస్‌వో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు ý డువు...
The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Oktelugu Epaper