Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంపై పవన్ పంజా!

Pawan Kalyan: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంపై పవన్ పంజా!

Pawan Kalyan: జనసేన పార్టీ బలోపేతం పై ఫుల్ ఫోకస్ పెట్టింది. అయితే ఈ విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన కంచుకోటలపై దృష్టి పెట్టింది. గత కొంతకాలంగా టిడిపికి చిక్కని నియోజకవర్గాలను తనకు విడిచి పెట్టాలని జనసేన కోరుతోంది. ప్రధానంగా రిజర్వుడు నియోజకవర్గాలపై ఆ పార్టీ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా అరకు పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తోంది జనసేన. ఇటీవల అరకు పార్లమెంట్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఇదే అంశం చర్చకు వచ్చింది.

* టిడిపికి అవకాశాలు తక్కువ..
సాధారణంగా ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచిన దాఖలాలు లేవు. కానీ 2024 ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ మెజారిటీ స్థానాల్లో గెలిచింది. అయినా సరే రెండు చోట్ల వైసిపి తన ఆధిపత్యాన్ని కొనసాగించగలిగింది. కూటమి ప్రభంజనంలో సైతం అరకు పార్లమెంటరీ స్థానం వైసీపీ ఖాతాలో పడింది. అందుకే ఈసారి ఎలాగైనా అరకు పార్లమెంట్ స్థానంలో కూటమి అడుగు పెట్టాలని చూస్తోంది. ఆ బాధ్యతను జనసేన తీసుకున్నట్లు తెలుస్తోంది. అరకు పార్లమెంట్ సీటుతో పాటు దాని పరిధిలోని మెజారిటీ అసెంబ్లీ స్థానాలను పొత్తులో భాగంగా జనసేన తీసుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.

* ఎంపీ తో పాటు ఎమ్మెల్యే సీట్లపై..
అరకు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో అరకు, పాడేరు, రంపచోడవరం, కురుపాం, సాలూరు, పార్వతీపురం, పాలకొండ నియోజకవర్గాలు ఉన్నాయి. అరకు తో పాటు పాడేరులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. పాలకొండ నుంచి జనసేన విజయం సాధించింది. మిగతా నాలుగు స్థానాల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. అరకు పార్లమెంట్ స్థానం మాత్రం వైసిపి చేజిక్కించుకుంది. అయితే ఇప్పుడు అరకు పార్లమెంట్ సీట్ తో పాటు దాదాపు ఓ నాలుగు నుంచి ఐదు స్థానాలపై జనసేన గురిపెట్టినట్లు సమాచారం.

* పవన్ ప్రత్యేక ఫోకస్..
రిజర్వుడు నియోజకవర్గాలపై జనసేన గురి పెట్టడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. గ్రామీణాభివృద్ధి తో పాటు అటవీ, పర్యావరణ శాఖలను సైతం తీసుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పనులపై దృష్టి పెట్టారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఓటు బ్యాంకుగా గిరిజనులు ఉన్నారు. వారు చాలావరకు జనసేన వైపు టర్న్ అయినట్లు ప్రచారంలో ఉంది. అందుకే ఆ స్థానాలపై జనసేన గురిపెట్టినట్లు తెలుస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Delhi Protests

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...
Team India Bowling

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
Oktelugu Epaper