Ramoji Rao Vs AP CM YS Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ఏ బహిరంగ సభ పెట్టినా.. మూడు మీడియా సంస్థలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. తనకు అండగా లేకపోయినా ఉన్నది ఉన్నట్లు చూపడం లేదని విమర్శిస్తున్నారు. టీడీపీకి కొమ్ముకాస్తున్నాయని ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ5 పై బహిరంగ వేదికలపైనే ప్రకటిస్తున్నారు. ఆయా మీడియా సంస్థలు కూడా వీటిని ఖండించడం లేదు. పైగా జగన్ ఏం చేసినా అందులో లోపాలు వెతకి, పెద్దపెద్ద శీర్షికలతో కథనాలు వండి వారుస్తున్నాయి. దీంతో జగన్ చేసిన ఆరోపణల్లో నిజం ఉందన్న భావన ఆంధ్రా ప్రజల్లో వ్యక్తమవుతోంది. తాజాగా ఈనాడు ఏపీకి వచ్చిన పెట్టుబడులను కూడా దుర్మార్గంగా అభివర్ణించడం చర్చనీయాంశమైంది.