spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: పిల్లలతో మరాఠీలో మాట్లాడుతాను.. మహారాష్ట్రలో పవన్ సంచలన కామెంట్స్

Pawan Kalyan: పిల్లలతో మరాఠీలో మాట్లాడుతాను.. మహారాష్ట్రలో పవన్ సంచలన కామెంట్స్

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ మహారాష్ట్రలో విస్తృతంగా పర్యటించారు. ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఎన్డీఏ కు మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్. ప్రధానంగా తెలుగు ప్రజలు అధికంగా నివాసం ఉండే బల్లార్పూర్ లో జరిగిన సభలో ఉత్సాహంగా మాట్లాడారు. బల్లార్పూర్ ఒక మినీ భారతదేశంగా అభివర్ణించారు. ఇక్కడ అన్ని భాషలు, అన్ని ప్రాంతాల ప్రజలు కలిసి ఉంటారని చెప్పారు. సనాతన ధర్మం అన్ని మతాలను సమానంగా చూస్తుందని చెప్పారు. అలాంటి సనాతన ధర్మం మీద దాడి జరిగితే ఖచ్చితంగా పోరాటం చేస్తానని చెప్పుకొచ్చారు. జనసేన పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చత్రపతి శివాజీ స్ఫూర్తి ఉందని చెప్పారు పవన్. ఏపీలో వైసీపీని ఓడించలేరంటే జనసేన ఓడించి చూపించిందని గుర్తు చేశారు. మహారాష్ట్రలోనూ ఎన్డీఏ కూటమిని గెలిపించి చూపించాలన్నారు. తాను తెలుగుతోపాటు మరాఠీ కూడా మాట్లాడతానని చెప్పుకొచ్చారు. ఇంట్లో తన పిల్లలతో మరాఠీలతో మాట్లాడతానని గుర్తు చేసుకున్నారు. విదేశీ భాషలు నేర్చుకునే మనం సరిహద్దు రాష్ట్రాల భాషలు కూడా నేర్చుకోవాలన్నారు. ఐదు ప్రాంతీయ భాషల పై పట్టు పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉందన్నారు.

* బిజెపి పెద్దల కోరిక మేరకు
ఎన్డీఏలో ఇప్పుడు పవన్ కీలక భాగస్వామి. ఏపీలో ఓటమి గెలుపు వెనుక పవన్ ఉన్నారు. సంపూర్ణ విజయం సాధించారు. జాతీయ స్థాయిలో సైతం పవన్ ప్రత్యేకంగా గుర్తింపు పొందారు. అందుకే పవన్ తో ప్రచారం చేయించాలని బిజెపి భావించింది. ప్రధానంగా తెలుగు ప్రజలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పవన్ ప్రచారం సాగింది. అక్కడ ప్రజలు కూడా ఎంతగానో పవన్ ఆదరించారు. ప్రత్యేకంగా ఆహ్వానించారు. మొత్తానికి అయితే పవన్ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.

* చంద్రబాబు పర్యటన రద్దుతో
మహారాష్ట్ర తెలంగాణకు సరిహద్దు. ఎక్కువగా తెలుగు ప్రజలే ఉంటారు. చాలా నియోజకవర్గాల్లో గెలుపోటములను నిర్దేశించగలరు. అందుకే బిజెపి అగ్ర నేతలు పవన్ తో పాటు చంద్రబాబును రంగంలోకి దించాలని భావించారు. మొన్న ఢిల్లీలో పర్యటించిన చంద్రబాబు అటు నుంచి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్తారని షెడ్యూల్ ఖరారు చేశారు. కానీ ఇంతలోనే ఆయన సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి చెందారు. దీంతో ఢిల్లీ నుంచి మహారాష్ట్ర రావాల్సిన చంద్రబాబు నేరుగా హైదరాబాద్ వెళ్ళిపోయారు. అక్కడ నుంచి సొంత గ్రామం నారావారిపల్లి వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అయితే పవన్ ఒక్కరే ప్రచారానికి దిగారు. కానీ విశేష ప్రభావితం చేశారని అక్కడి ఎన్డీఏ నాయకులు భావిస్తున్నారు. తప్పకుండా పవన్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో ఎన్డీఏ అభ్యర్థులు గెలుపొందుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper