Elecsense Survey: ఏపీలో అధికారంలోకి రావడానికి అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. రెండోసారి విజయం సాధించాలని జగన్ చూస్తున్నారు. వైసీపీని గద్దె దించాలని టిడిపి కూటమి కట్టింది. మరోవైపు షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ పట్టు బిగిస్తోంది. పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో హోరాహోరీ ఫైట్ తప్పదన్న సంకేతాలు వస్తున్నాయి. ఈ తరుణంలో సర్వే సంస్థలు ప్రజాభిప్రాయాన్ని ఓడిసిపడుతున్నాయి. తాజాగా ఎలెసెన్స్ అనే సంస్థ తన సర్వే ఫలితాలను వెల్లడించింది. మార్చి 25 నుంచి ఏప్రిల్ 12 వరకు సర్వే నిర్వహించినట్లు చెప్పుకొస్తోంది. మొత్తం 86,200 మంది నుంచి అభిప్రాయాలను సేకరించినట్లు ప్రకటించింది.
రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వే కొనసాగింది. అయితే విపక్షాలన్నీ కూటమి కట్టినా.. జగన్ గద్దె దించడం సాధ్యం కాదని ఈ సర్వే తేల్చింది. 127 అసెంబ్లీ స్థానాలతో వైసిపి విజయం సాధిస్తుందని స్పష్టం చేసింది. 50.38 శాతం ఓట్లతో ఈ ఘనత సాధిస్తుందని తేల్చింది. టిడిపి కూటమి కేవలం 48 స్థానాలకు పరిమితం అవుతుందని.. 45.58 శాతం ఓట్ షేర్ సాధిస్తుందని చెప్పుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ 1.3 శాతం ఓట్లకు పరిమితం కానుందని తెలిసింది.
జిల్లాల వారీగా ఫలితాలను పరిశీలిస్తే.. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ 8, ఎన్డీఏ 2, విజయనగరంలో వైసీపీ 8, ఎన్డీఏ ఒకటి, విశాఖలో వైసీపీ నాలుగు, ఎన్డీఏ 8, ఇతరులు 3, తూర్పుగోదావరిలో వైసీపీ 9, ఎన్డీఏ 9, ఇతరులు ఒకటి, పశ్చిమగోదావరిలో వైసీపీ 8, ఎన్డీఏ 7, కృష్ణాజిల్లాలో వైసిపి 10, ఎన్డీఏ 5, ఇతరులు 1, గుంటూరులో వైసీపీ 9, ఎన్డీఏ 2, ఇతరులు ఆరు, ప్రకాశం లో వైసీపీ 9, ఎన్డీఏ 2, ఇతరులు ఒకటి, నెల్లూరులో వైసీపీ 9, ఇతరులు ఒకటి, చిత్తూరులో వైసీపీ 12, ఎన్డీఏ ఒకటి, కడపలో 10కి 10 స్థానాలు వైసిపి, కర్నూలులో వైసీపీ 13, ఎన్డీఏ ఒకటి, అనంతపురంలో వైసీపీకి 12, ఎన్డీఏకు ఒక్క స్థానం వచ్చే అవకాశాలు ఉన్నట్లు తేలింది.
Elecsense Survey for Andhra Pradesh Assembly Election –
YSRCP : 127 (50.38%)
TDP+ : 48 (45.58%)
INC : 00 (1.38%)
OTH : 00 (2.66%)As per this survey CM Jagan Reddy will be re-elected to power.
Survey was done from 25th March to 12th April.
Sample Size : 86,200
— News Arena India (@NewsArenaIndia) April 15, 2024