Duvvada Srinivas: వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను( duvvada Srinivas ) పోలీసులు అరెస్టు చేయనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఆయన అరెస్టు తప్పదని సమాచారం. ఏ క్షణంలోనైనా ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందని అధికారిక వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో దువ్వాడ శ్రీనివాస్ పై కేసులు నమోదవుతున్నాయి. ఉభయగోదావరి జిల్లాలతో పాటు ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో దువ్వాడ శ్రీనివాస్ పై జనసేన నేతలు కేసులు పెట్టారు.
Also Read: ఏపీ రాజకీయాల్లో సంచలనం.. రాజకీయాల నుంచి ఆ యువ నేత నిష్క్రమణ?
* వైసిపి హయాంలో..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వ హయాంలో అప్పటి జనసేన అధినేత, ఇప్పటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై పలుమార్లు దూషించారు దువ్వాడ శ్రీనివాస్. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఆయనపై తిట్లు అందించారు కూడా. అయితే అప్పట్లో జనసేన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయితే ఇటీవల అసెంబ్లీ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కొద్దిసేపు ఉండి బయటకు వెళ్ళిపోయారు. ఈ సందర్భంలో కూడా దువ్వాడ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వాటిపైనే జనసేన నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు దువ్వాడ శ్రీనివాస్ పై కేసులు నమోదయ్యాయి.
* పవన్ పై సంచలన ఆరోపణలు..
ఇటీవల అసెంబ్లీ సమావేశాలకు( assembly sessions ) హాజరైనప్పుడు పవన్ కళ్యాణ్ కనిపించలేదని.. ఆయన మారువేషంలో ఉండిపోయారని ఎద్దేవా చేశారు దువ్వాడ శ్రీనివాస్. అంతటితో ఆగకుండా అసెంబ్లీలో మాట్లాడకుండా ఉండేందుకు చంద్రబాబు నెలకు 50 కోట్ల రూపాయల చొప్పున పవన్ కళ్యాణ్ కు చెల్లిస్తున్నట్లు సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా జనసేన నేతలు రియాక్ట్ అయ్యారు. అరెస్టుకు సిద్ధంగా ఉండాలని దువ్వాడ శ్రీనివాస్ కు సవాల్ చేశారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దువ్వాడ చేసిన వ్యాఖ్యలు, తాజాగా చేసిన కామెంట్స్ పై పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన మరుక్షణం దువ్వాడ శ్రీనివాస్ అరెస్టు తప్పదని ప్రచారం జరుగుతోంది.
* నేతల వరుస అరెస్టులతో..
ఇప్పటికే వల్లభనేని వంశీ మోహన్ ( vallabhaneni Vamsi Mohan ) అరెస్టు అయ్యారు. రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనపై కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు పోసాని కృష్ణ మురళి అరెస్టు కూడా జరిగింది. ఆయనపై సైతం కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఇటీవల ఆయనకు బెయిల్ లభించింది. ఈ తరుణంలో నెక్స్ట్ అరెస్టు ఎవరన్నది తెలియాల్సి ఉంది. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే దువ్వాడ శ్రీనివాస్ అరెస్ట్ ఖాయమని తెలుస్తోంది.
Also Read: ఒక్కొక్కరికీ రూ.50 వేల నుంచి లక్ష.. డ్వాక్రా మహిళలకు రూ.35,000.. ఏపీలో పండగే!