Homeఆంధ్రప్రదేశ్‌Duvvada Srinivas: మాధురి పోస్టింగ్.. దువ్వాడ ఊస్టింగ్!

Duvvada Srinivas: మాధురి పోస్టింగ్.. దువ్వాడ ఊస్టింగ్!

Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్( MLC duvvada Srinivas ) రాజకీయ జీవితం డోలాయమానంలో పడింది. ఆయన రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పడేలా ఉంది. ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ ను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఎమ్మెల్సీ దువ్వాడ చెబుతున్నారు. అయితే పార్టీ క్రమశిక్షణ అతిక్రమించినందుకే వేటు వేసినట్లు హైకమాండ్ ప్రకటించింది. అదే సమయంలో మంత్రి లోకేష్ ను పొగడడం వల్లే దువ్వాడ శ్రీనివాసును సస్పెండ్ చేశారని టిడిపి, జనసేన సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నాయి. ఇంకోవైపు వైసీపీ సోషల్ మీడియాలో మాత్రం దువ్వాడను ఏనాడో సస్పెండ్ చేయాల్సిందేనన్న పోస్టులు కనిపిస్తున్నాయి.

Also Read: అమ్మకానికి విశాఖ.. కేశినేని నాని సంచలనం!

* రకరకాలుగా కామెంట్స్..
అయితే రకరకాల విశ్లేషణలు ఉన్నాయి కానీ.. అసలు దువ్వాడను ఎందుకు సస్పెండ్ చేశారు అన్నది స్పష్టత లేకుండా పోతోంది. వాస్తవానికి దువ్వాడపై ఎప్పుడో సస్పెన్షన్( suspension) విధించాల్సి ఉన్న.. ఆయన వైఖరి మారుతుందేమోనన్న ఆలోచనతో ఇన్నాళ్లు హై కమాండ్ వేచి చూసినట్లు తెలుస్తోంది. రోజురోజుకు ఆయన పరిస్థితిపై విమర్శలు ఎక్కువ అవుతుండడంతో చివరికి వేటు వేశారని తెలుస్తోంది. భార్య పిల్లలతో తగాదా పెట్టుకున్నారు దువ్వాడ శ్రీనివాస్. ప్రేయసి మాధురితో కలిసి చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. రోజురోజుకు వారు స్వేచ్ఛగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో రచ్చకెక్కుతున్నారు. మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అది పార్టీకి చెడ్డ పేరుగా మారుతోంది. వాస్తవానికి కుటుంబ వివాదం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో టెక్కలి ఇన్చార్జి పోస్టు నుంచి దువ్వాడ శ్రీనివాసును తొలగించారు. అయితే అది పనిష్మెంట్ గా భావించలేదు దువ్వాడ. మళ్లీ ఎన్నికల నాటికి తనకే టికెట్ అన్న ధీమా ఆయనది. అందుకే కొంచెం విపరీతంగా ప్రవర్తించారు. అందుకే హై కమాండ్ తోక కత్తిరించినట్లు వైసిపి వర్గాలు చెబుతున్నాయి.

* ఇన్చార్జిని తక్కువ చేసేలా..
మరోవైపు టెక్కలి నియోజకవర్గంలో( tekkali Constituition ) సైతం దువ్వెల మాధురి తల దూర్చుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ వైయస్సార్ కాంగ్రెస్ ఇన్చార్జిగా పేరాడ తిలక్ ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో తిలక్కు శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. దువ్వాడ శ్రీనివాస్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేశారు. కానీ ఇద్దరూ ఓడిపోయారు. టెక్కలి ఇన్చార్జిగా దువ్వాడ శ్రీనివాసును తప్పించారు. పేరాడ తిలక్ కు ఆ బాధ్యతలు అప్పగించారు. కానీ ఇటీవల మాధురి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. పుష్ప డైలాగును గుర్తుచేసేలా..’ దమ్ముంటే తెచ్చుకోరా టిక్కెట్టు.. తెచ్చుకుంటే వదిలేస్తే పోస్టింగు’ ఆల్టో పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చర్చకు దారితీసింది. దీనిపై టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జ్ తిలక్ తో పాటు చాలామంది వైసీపీ నేతలు హై కమాండ్కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీనిపైనే హై కమాండ్ సీరియస్ గా స్పందించి చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

* మహిళా నేతల ఫిర్యాదు..
మరోవైపు అడల్టరీ( adultery ) పేరుతో దువ్వాడ శ్రీనివాస్ జంట చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాతో పాటు మీడియా ఛానళ్లకు వారు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. అయితే ఇవి మహిళల విషయంలో ఇబ్బందికరంగా ఉన్నాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా నేతలు జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. వారి ప్రవర్తనతో పార్టీకి చెడ్డ పేరు వస్తోందని.. ముఖ్యంగా మహిళలు యావగించుకుంటున్నారని.. చర్యలు తీసుకోకపోవడంతో హై కమాండ్ తీరును ఎక్కువమంది తప్పు పడుతున్నారని ఫిర్యాదు చేశారు. అందుకే అధినేత జగన్మోహన్ రెడ్డి చర్యలకు ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

 

Also Read: మాజీ మంత్రి విడదల రజిని చుట్టు ఉచ్చు.. బెదిరింపు కేసులో కీలక అరెస్ట్!

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular