Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu Welfare Schemes : వాడివేడి చర్చలు.. చంద్రబాబు హామీలే అసలు టాపిక్

వాడివేడి చర్చలు.. చంద్రబాబు హామీలే అసలు టాపిక్

Chandrababu Welfare Schemes : ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. ఈనెల 4 నాటికి ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాది పూర్తి కానుంది. అయితే గత ఏడాదికాలంగా సంక్షేమ పథకాలు ఆశించిన స్థాయిలో అమలు కాలేదు. కానీ పింఛన్లు మొత్తాన్ని పెంచి అందించగలిగారు. మూడు నెలల బకాయిలతో సహా చెల్లింపులు చేశారు. మరోవైపు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేశారు. అయితే సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఇచ్చిన హామీలను మాత్రం అమలు చేయలేకపోయారు. ప్రధానంగా పిల్లల చదువుకు సంబంధించి తల్లికి వందనం, రైతుల సాయానికి సంబంధించి అన్నదాత సుఖీభవ కోసం ఏడాదిగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ నెల నుంచి సంక్షేమ పథకాలు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. కానీ విపక్షాలు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. హామీలు ఇచ్చారు కదా అమలు చేయాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. లేకుంటే ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరిస్తున్నారు.

Also Read : అమరావతికి అక్కినేని నాగార్జున.. సీఎంతో భేటీ.. కారణం అదే!

* వైసిపి హయాంలో సంక్షేమ పథకాలు..
2019లో అధికారంలోకి వచ్చింది వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ. అప్పట్లో నవరత్నాలను ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి పథకాలు అమలు చేయడం ప్రారంభించారు. దీంతో జగన్ సర్కార్ పట్ల ప్రజల్లో ఒక రకమైన సానుకూలత కనిపించింది. అయితే క్రమేపి 2024 ఎన్నికలు వచ్చేనాటికి సీన్ మారింది. ప్రజలు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కోరుకున్నారు. జగన్మోహన్ రెడ్డి సర్కార్ మాత్రం కేవలం సంక్షేమాన్ని అమలు చేసింది. అభివృద్ధి అన్న విషయాన్ని మరిచిపోయింది. అదే సమయంలో విపక్ష టిడిపి తాము అధికారంలోకి వస్తే రెట్టింపు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పుకొచ్చింది. అయితే ఏడాదిగా అభివృద్ధి పనులకు పర్వాలేదు కానీ.. సంక్షేమ పథకాలు ప్రారంభం కాకపోవడం మైనస్ గా మారుతుంది.

* అంతటా అదే చర్చ
ఇప్పుడు ఎక్కడ చూసినా సంక్షేమ పథకాలపై( welfare schemes) చర్చ ఎక్కువగా సాగుతోంది. దానికి కారణం లేకపోలేదు. కూటమి పాలనకు ఏడాది అవుతోంది. ఇంతకుముందు వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు అమలు అనేది సరిగ్గా సమయానుకూలంగా జరిగేవి. కానీ ఏడాదిగా అదిగో ఇదిగో అంటూ టిడిపి సర్కార్ కాలయాపన చేసింది. అయితే ప్రజల్లో ఒక రకమైన సర్దుబాటు కనిపిస్తోంది. అభివృద్ధిని చూసి సంతృప్తి పడుతున్న వారు ఉన్నారు. అయితే ఇదే తరుణంలో విపక్షాలు సంక్షేమ పథకాల కోసం పదేపదే ప్రశ్నిస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రేపు వెన్నుపోటు దినం నిర్వహించాలని పిలుపునిచ్చింది. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది.

* ఇరుకున పెడుతున్న విపక్షాలు..
అయితే సంక్షేమ పథకాల గురించి ప్రస్తావించి టిడిపి కూటమికి ( TDP Alliance )ఇరుకున పెట్టాలని విపక్షాలు భావిస్తున్నాయి. ఇటీవల టిడిపి అనుకూల మీడియాలో ఓ డిబేట్ జరిగింది. అక్కడ వామపక్ష నేత ఒకరు సంక్షేమ పథకాలు గురించి గట్టిగానే ప్రశ్నించారు. సహజంగానే సదరు చానల్ జర్నలిస్టు టిడిపి కూటమి విధానాలను అనుకూలంగా మారుస్తుంటారు. అయితే సదరు వామపక్ష నాయకుడు సడన్ గా ప్రశ్నించేసరికి ఆ జర్నలిస్టుకు ఎలా స్పందించాలో తెలియలేదు. అయితే ఈ భయం టిడిపి కూటమి ప్రజాప్రతినిధుల్లో కూడా కనిపిస్తోంది. వీలైనంత త్వరగా సంక్షేమ పథకాలు అమలు చేయాలని వారు కోరుకుంటున్నారు. అయితే ఈ నెలలోనే రెండు కీలక సంక్షేమ పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. అప్పటినుంచి సానుకూలత ఏర్పడుతుందని కూటమి వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular