spot_img
Homeఆంధ్రప్రదేశ్‌AP Pensions: పదవీ విరమణ.. పెన్షన్ల పై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

AP Pensions: పదవీ విరమణ.. పెన్షన్ల పై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

AP Pensions: ఏపీ ప్రభుత్వం( AP government) కీలక నిర్ణయం దిశగా అడుగులు వేసింది. ఉద్యోగుల పదవీ విరమణ, పెన్షన్ పై కొత్త మార్గదర్శకాలు సిద్ధం చేసింది. అందుకు సంబంధించి ముసాయిదా విడుదల చేసింది. దీనిపై ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను సైతం కోరింది. ఉద్యోగి 33 ఏళ్ల సర్వీసు పూర్తి చేస్తే ప్రభుత్వానికి పదవీ విరమణ చేయించే విధంగా అధికారం కల్పించే ప్రతిపాదన తీసుకొచ్చింది. ముందుగా నోటీసు, లేదంటే జీతభత్యాలు ఇచ్చి వారితో పదవీ విరమణ చేయించేలా నిబంధనలు సిద్ధం చేయడం విశేషం. అయితే తుదిగా ఉద్యోగ సంఘాల నుంచి వచ్చే అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని.. తుది ఉత్తర్వులు జారీకి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

* ప్రజా ప్రయోజనాల దృష్ట్యా..
తాజా మార్గదర్శకాల మేరకు 33 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగి.. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పదవీ విరమణ చేయించేలా సరికొత్త విధానాన్ని ప్రభుత్వం ముసాయిదాలో పేర్కొంది. సాధారణంగా పదవీ విరమణ వయస్సు రాకపోయినా.. 33 ఏళ్ల సర్వీస్ కాలం పూర్తి చేస్తే.. పదవీ విరమణ చేయించేలా నూతన సివిల్ ఏపీ సర్వీసెస్ పెన్షన్ నిబంధనలు- 2026 ముసాయిదాను ప్రభుత్వం విడుదల చేసింది. 33 సంవత్సరాల పాటు సర్వీస్ పూర్తి చేసుకోవడం ద్వారా.. ఉద్యోగి పదవీ విరమణ చేసిన తర్వాత పూర్తిస్థాయిలో పెన్షన్ ప్రయోజనాలు అందుతాయి. ఒకవేళ ఉద్యోగి 33 ఏళ్ల సర్వీసుకు దగ్గరలో ఉంటే.. వారికి మూడు నెలల ముందు నోటీసులు జారీ చేస్తారు. ఆ మూడు నెలలకు సమానమైన జీతభత్యాలు కూడా అందిస్తారు. దీంతో పాటు ఒక వెసులుబాటు ఇస్తూ ప్రతిపాదనలు చేశారు. పదవీ విరమణ పింఛన్ లో కొంత నగదు మొత్తాన్ని కమ్యూట్ గా మార్చుకోవచ్చు. ముసాయిదాలో పేర్కొన్న ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వ గుర్తింపు ఉన్న ఉద్యోగ సంఘాల నుంచి అభిప్రాయాలను కోరుతోంది. ఏకాభిప్రాయంతోనే అడుగులు వేయాలని చూస్తోంది ఏపీ ప్రభుత్వం.

* తెరపైకి కొత్త విధానం..
ప్రస్తుతం ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980( AP revised pension rules 1980) అమల్లో ఉంది. దీని స్థానంలోనే తాజాగా ఆంధ్ర ప్రదేశ్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ నిబంధనలు 2026 తీసుకురావాలని భావిస్తోంది. ఈ కొత్త ముసాయిదాలు 98 పేజీలలో కొత్త నిబంధనలను వివరించారు. అయితే ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విధానంలో పదవీ విరమణ గరిష్ట సర్వీసు.. 33 ఏళ్ల తర్వాత చేయించే నిబంధన పై మాత్రం అభ్యంతరాలు ఉన్నాయి. సాధారణంగా ఉద్యోగులు పింఛన్ కోసం కనీసం 10 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేయాల్సి వస్తుంది.. పైగా చివరి వేతనంలో 50% పింఛన్ గా వస్తుంది. అంటే సర్వీసు తగ్గితే.. చివరి జీతాన్ని ప్రామాణికంగా తీసుకుంటే మాత్రం పింఛన్ మొత్తం తగ్గిపోయే అవకాశం ఉంది. అందుకే దీనిపై అభ్యంతరాలు ఎక్కువగా వ్యక్తం అయ్యే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Sidiri Appalaraju Arrest

Sidiri Appalaraju Arrest: అరెస్టు చేసే దాకా తెచ్చుకున్న ఆ మాజీ మంత్రి!

Sidiri Appalaraju Arrest: ఎట్టకేలకు మాజీమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజు అరెస్టయ్యారు. అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ నడిపిన బైక్ ఢీకొని దానయ్య అనే గొర్రెల కాపరి...
Healthy Dinner

Healthy Dinner: రాత్రి సమయంలో ఈ ఆహారం తింటున్నారా…

Healthy Dinner: ప్రస్తుత కాలంలో చాలామంది నిద్ర సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే కొందరు ఉద్యోగాలు ఇతర కారణాలతో ఒత్తిడిని ఎదుర్కొని సరైన నిద్ర పోవడం లేదు. మరికొందరు రాత్రి సమయంలో జీర్ణం...
RRB JE Recruitment 2026

RRB JE Recruitment 2026: రైల్వేలో యువతకు బంపర్‌ ఆఫర్.. ఈ ఛాన్స్‌ మిస్‌ చేసుకోకండి!

RRB JE Recruitment 2026: భారతీయ రైల్వేలు దేశంలోని అతిపెద్ద పబ్లిక్‌ సెక్టార్‌ సంస్థల్లో ఒకటి. ఇప్పుడు ఆ సంస్థలోని ముఖ్యమైన టెక్నికల్‌ పోస్టులను భర్తీ చేయడానికి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డులు (ఆర్‌ఆర్‌బీ)...
Cockroach Facts

Cockroach Facts: తల లేకపోయినా ఈ జీవి బతుకుతుంది.. సృష్టికే సవాల్ విసిరే దీని కథేంటో తెలుసా

Cockroach Facts: ఒక నిమిషం గాలి పీల్చుకోకుండా మనం ఉండగలుగుతామా.. అక్కడి దాకా ఎందుకు తల లేకుండా బతకగలుగుతామా.. ఇది సాధ్యమవుతుందా.. కానీ ఆ జీవి విషయంలో సాధ్యమవుతుంది. ఎందుకంటే అది సృష్టికే...
JP Nadda

JP Nadda: నడ్డా చెప్పింది నిజమే.. పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదు..

JP Nadda: ఈ దేశంలో పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత ఏ పార్టీకి కూడా లేదు. ఈ మాట నూటికి నూరు శాతం కాదు కోటి శాతం నిజం....
Oktelugu Epaper