Homeఆంధ్రప్రదేశ్‌AP Delimitation News 2025: ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన.. కేంద్రం గ్రీన్ సిగ్నల్!

AP Delimitation News 2025: ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన.. కేంద్రం గ్రీన్ సిగ్నల్!

AP Delimitation News 2025: ఏపీలో( Andhra Pradesh) నియోజకవర్గాల పునర్విభజనపై మరోసారి చర్చ ప్రారంభం అయింది. బీహార్ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించింది. దీంతో కేంద్ర ప్రభుత్వపరంగా నిర్ణయాలు శరవేగంగా తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా జమిలీ ఎన్నికలతో పాటు నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే రాజకీయంగా ముందుగా ఎన్డీఏ పక్షాలకు ప్రయోజనం కల్పించే విషయాలను మాత్రమే పెద్దపీట వేయాలని కేంద్రం భావిస్తోంది. అందులో భాగంగా అన్ని రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన పూర్తి చేస్తే రాజకీయ ప్రాతినిధ్యం పెరుగుతుందని అంచనా వేస్తోంది. ఇదే గాని జరిగితే ఏపీలో 50 అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంది. విభజన సమయంలోనే రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయని కేంద్రం స్పష్టం చేసింది. అయితే విభజన జరిగి పుష్కరకాలం అవుతోంది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. అయితే ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో టిడిపి కీలక భాగస్వామి కావడం.. రాజకీయంగా అనుకూలమైన వాతావరణం ఉండడంతో నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం పూనుకుంటుందన్న టాక్ వినిపిస్తోంది.

Also Read: చంద్రబాబు మరో బిగ్ స్టెప్.. గేమ్ చేంజర్ అవుతుందా? 

మరో 50 అసెంబ్లీ సీట్లు..
ప్రస్తుతం ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 25 పార్లమెంటు స్థానాలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మరో 50 అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశం ఉంది. 225 అసెంబ్లీ సీట్లు వరకు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఐదు నుంచి ఏడు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే దాదాపు మరో 6 పదవులు పెరిగే అవకాశం ఉంది. మొన్నటి ఎన్నికల్లో పొత్తులో భాగంగా చాలామంది అవకాశాలు కోల్పోయారు. అటువంటివారు పునర్విభజనతో కొత్త నియోజకవర్గాల ఏర్పాటు అవుతుందని భావిస్తున్నారు. తమకు తప్పకుండా ఛాన్స్ వస్తుందని అంచనా వేస్తున్నారు.

జన గణన పెండింగ్..
వాస్తవానికి దేశంలో జన గణన( census ) జరగాల్సి ఉంది. చివరిసారిగా 2011 లో జరిగింది. ప్రతి పదేళ్లకు ఒకసారి జనగణన జరగడం ఆనవాయితీగా వస్తోంది. కానీ 2021లో జరగాల్సిన జనగణన కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పటివరకు జనగణన పూర్తి చేయలేకపోయారు. అది జరిగితే కానీ కులగనన చేయలేరు. అయితే ఇప్పుడు జనగణన జరిగితే కానీ నియోజకవర్గాల పునర్విభజన చేయలేరని వార్తలు వచ్చాయి. అయితే దేశంలో ప్రజల కోసం ఎప్పుడైనా పాలనాపరమైన అంశాల్లో చేర్పులు మార్పులు చేసుకోవచ్చని రాజ్యాంగం చెబుతోంది. అందుకే ఇప్పుడు జనగనన లేకుండానే నియోజకవర్గాల పునర్విభజన చేయవచ్చని అంశం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి అనుకూల వాతావరణం ఉండడంతో నియోజకవర్గాల పునర్విభజన చేయవచ్చని వార్తలు వస్తున్నాయి.

Also Read:  పిఠాపురం శాశ్వతంగా.. డిప్యూటీ సీఎం పవన్ ప్లాన్ అదే!

బిజెపికి సైతం ప్రయోజనం..
అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పార్లమెంట్ నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఏపీ నుంచి బిజెపి( Bhartiya Janata Party) ఆరు ఎంపీ సీట్లను పొత్తులో భాగంగా తీసుకుంది. అసెంబ్లీ సీట్ల పరంగా 10 సీట్లు మాత్రమే తీసుకున్న బిజెపి.. పార్లమెంట్ స్థానాల విషయానికి వచ్చేసరికి సింహభాగం ప్రయోజనాలను కోరింది. ఇప్పుడు కూడా పునర్విభజన ద్వారా పార్లమెంట్ సీట్లు పెరిగితే అది బిజెపికి లాభం. తప్పకుండా చంద్రబాబు పార్లమెంట్ స్థానాలైతే ఇట్టే ఇచ్చేస్తారు. రాష్ట్రంలో అధికారంలో ఉండడం చంద్రబాబుకు ముఖ్యం. కేంద్రంలో అధికారంలోకి రావడం బిజెపికి ప్రధానం. అందుకే పరస్పర ప్రయోజనాలకు అనుగుణంగా రెండు పార్టీలు అడుగులు వేస్తాయి. సహకరించేందుకు జనసేన సైతం సిద్ధంగా ఉంది. దీంతో పునర్విభజన జరిగి తీరుతుందని సంకేతాలు వస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular