Homeఅంతర్జాతీయంBangladesh: పాకిస్తాన్‌ 2గా మారబోతున్న బంగ్లాదేశ్‌.. రాజ్యాంగ సవరణకు ముస్లింల పట్టు!

Bangladesh: పాకిస్తాన్‌ 2గా మారబోతున్న బంగ్లాదేశ్‌.. రాజ్యాంగ సవరణకు ముస్లింల పట్టు!

Bangladesh: మన పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో 2024లో విద్యార్థి ఉద్యమం తర్వాత షేక్‌ హసీనా ప్రభుత్వం పతనమైంది. ఆవామీ లీగ్‌ను నిషేధించిన నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో కొత్త రాజకీయ చిత్రం ఏర్పడింది. 2026 ఎన్నికల్లో బీఎన్‌పీ ఘన విజయం సాధించగా, జమాత్‌–ఎ–ఇస్లామీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఈ పరిణామాలు దేశాన్ని మరో ఆఫ్ఘానిస్తాన్‌ లేదా పాకిస్తాన్‌లా మార్చే ప్రయత్నాలుగా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. బీఎన్‌పీ ప్రభుత్వంపై జమాత్‌ ప్రభావం.. బీఎన్‌పీకి సొంత బలం లేదు. ప్రజల మద్దతు కూడా లేదు. […]

Bangladesh: మన పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో 2024లో విద్యార్థి ఉద్యమం తర్వాత షేక్‌ హసీనా ప్రభుత్వం పతనమైంది. ఆవామీ లీగ్‌ను నిషేధించిన నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో కొత్త రాజకీయ చిత్రం ఏర్పడింది. 2026 ఎన్నికల్లో బీఎన్‌పీ ఘన విజయం సాధించగా, జమాత్‌–ఎ–ఇస్లామీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. ఈ పరిణామాలు దేశాన్ని మరో ఆఫ్ఘానిస్తాన్‌ లేదా పాకిస్తాన్‌లా మార్చే ప్రయత్నాలుగా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

బీఎన్‌పీ ప్రభుత్వంపై జమాత్‌ ప్రభావం..
బీఎన్‌పీకి సొంత బలం లేదు. ప్రజల మద్దతు కూడా లేదు. విద్యార్థుల ఉద్యమం, ఆవామీ లీగ్‌ నిషేధం వంటి అంశాలు ఎన్నికల్లో బీఎన్‌పీని ప్రత్యామ్నాయంగా నిలబెట్టాయి. ఎన్నికల్లో అది మెజారిటీ సీట్లు సాధించింది. అయితే జమాత్‌–ఎ–ఇస్లామీ దాదాపు మూడింట ఒక వంతు ఓట్లు, అధిక సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్ష శక్తిగా నిలిచింది. జూలై చార్టర్‌ అమలు, రాజ్యాంగ సవరణలపై ఇరు పక్షాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. జమాత్‌ నేతృత్వంలోని కూటమి రాజ్యాంగ సంస్కరణలపై ఒత్తిడి పెంచుతోంది.

ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ డిమాండ్లు..
కొన్ని ఫండమెంటలిస్ట్‌ వర్గాలు దేశాన్ని ఇస్లామిక్‌ రిపబ్లిక్‌గా ప్రకటించాలని, రాజ్యాంగంలో సవరణలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. 90 శాతం ముస్లింలు ఉన్న దేశంలో ముస్లిం గుర్తింపు బలపడాలనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి మార్పులు జరిగితే అంతర్గత సమస్యలు, మైనారిటీల భద్రత, ప్రాంతీయ స్థిరత్వంపై ప్రభావం పడుతుందని బీఎన్‌పీ వర్గాలు ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తోంది. అమెరికా వంటి దేశాల నుంచి ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని కొన్ని విశ్లేషణలు సూచిస్తున్నాయి.

ఉగ్రవాద భయాలు..
బంగ్లాదేశ్‌లో ఇప్పటికే ఉగ్రవాద నెట్‌వర్క్‌ల కార్యకలాపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశం ముస్లిం రాజ్యంగా మారితే లష్కర్‌–ఎ–తోయిబా, జైష్‌–ఎ–మహ్మద్‌ వంటి సంస్థలకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని భయాలు వ్యక్తమవుతున్నాయి. జమాత్‌ పెరుగుదలను ఈ దిశగా అడుగులుగా చూసేవారు ఉన్నారు. అయితే ప్రభుత్వం, సెక్యూరిటీ ఏజెన్సీలు ఇంకా నియంత్రణలో ఉన్నాయని, పూర్తి ఉన్మాద రాజ్యంగా మారడం ఇంకా జరగలేదని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

సైకలాజికల్‌ గేమ్‌..
ఈ మార్పులను సైకలాజికల్‌ గేమ్‌గా అభివర్ణించేవారు ఉన్నారు. బీఎన్‌పీకి సొంత బలం లేకపోవడం, జమాత్‌ కీలక పాత్ర పోషించడం, రాజ్యాంగ సవరణలపై ఒత్తిడి ఇవన్నీ కలిసి దేశ దిశను మార్చే ప్రయత్నంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రజాస్వామ్య ప్రక్రియ, ఎన్నికల ఫలితాలు, అంతర్జాతీయ పర్యవేక్షణ ఇంకా కొనసాగుతున్నాయి. బంగ్లాదేశ్‌ సెక్యులర్‌ సంప్రదాయాలను కాపాడుకుంటూ ముందుకు సాగుతుందా, లేక మతాధారిత రాజకీయాల వైపు మళ్లుతుందా అనేది రాబోయే కాలంలోనే స్పష్టమవుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper