
గ్రేటర్ లో దిగ్గజాలు మట్టి కరిచారు. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కుటుంబ సభ్యులు, బంధువులు ఓడిపోయారు. కానీ ఆ టీఆర్ఎస్ జంట దంపతులు మాత్రం గెలిచారు. మంత్రి తలసాని బంధువు రాంగోపాల్ పేట డివిజన్ నుంచి పోటీచేసి ఓడిపోయాడు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య కూడా కవాడిగూడలో ఓడిపోయింది. ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి భార్య సైతం ఓడిపోయారు. ఇలా అందరూ ఓడిపోయినా ఈ టీఆర్ఎస్ జంట దంపతులు మాత్రం గెలవడం విశేషం.
Also Read: పీసీపీ పోస్టు కోసం సీనియర్ల పంచాయితీ!!
జీహెచ్ఎంసీలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక జంట మాత్రం సత్తా చాటింది. 2016లో కార్పొరేటర్లుగా గెలిచిన దంపతులు ఇంత గడ్డు పరిస్థితులను తట్టుకొని రెండోసారి గెలవడం విశేషం. రెండు డివిజన్లలో వరుసగా రెండోసారి విజయం సాధించారు.మరోసారి ఇద్దరూ కూడా అవే స్థానాల నుంచి టీఆర్ఎస్ తరుఫునే గెలిచారు.
మాదాపూర్ నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన జగదీశ్వర్ గౌడ్ విజయం సాధించగా.. ఆయన భార్య పూజిత హఫీజ్ పేట నుంచి కార్పొరేటర్ గా గెలుపొందింది.
Also Read: ‘గ్రేటర్’ను ఏలనున్న మహిళామణులు.. వీరి సంఖ్య ఎంతంటే?
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకున్నాయి. గెలవాల్సిన వారు ఓడారు.. ఓడుతామనుకున్న వారు గెలిచారు. టీఆర్ఎస్ మేయర్ అభ్యర్థులు సైతం ఓడిపోయారు. బీజేపీ దెబ్బకు టీఆర్ఎస్ సిట్టింగ్ లు సగం మంది కొట్టుకుపోయారు. అధికార బలం కూడా వారిని కాపాడలేకపోయింది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్