HomeతెలంగాణTelangana Rising Global Summit 2025: తెలంగాణ బ్రాండింగ్‌ సరే.. వాటికి ట్రీట్‌మెంట్‌ ఎప్పుడు రేవంత్...

Telangana Rising Global Summit 2025: తెలంగాణ బ్రాండింగ్‌ సరే.. వాటికి ట్రీట్‌మెంట్‌ ఎప్పుడు రేవంత్ సార్?

Telangana Rising Global Summit 2025: తెలంగాణ.. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి 10 ఏళ్లు గడిచింది. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది. విశ్వనగరంగా గుర్తింపు తెచ్చింది. ఇక ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం తెంగాణను బ్రాండింగ్‌ చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలంగాణ పేరును దేశీయ, అంతర్జాతీయస్థాయిలో గౌరవించుకోవాలని, పెట్టుబడులు, పరిశ్రమలను ఆకర్షించాలని ప్రధాన ఉద్దేశ్యంతో ’తెలంగాణ బ్రాండింగ్‌’ను చేపట్టారు. డిసెంబర్‌ 8, 9న జరిగే తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సదస్సులో ఈ లక్ష్యాలను […]

Telangana Rising Global Summit 2025: తెలంగాణ.. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి 10 ఏళ్లు గడిచింది. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది. విశ్వనగరంగా గుర్తింపు తెచ్చింది. ఇక ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం తెంగాణను బ్రాండింగ్‌ చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలంగాణ పేరును దేశీయ, అంతర్జాతీయస్థాయిలో గౌరవించుకోవాలని, పెట్టుబడులు, పరిశ్రమలను ఆకర్షించాలని ప్రధాన ఉద్దేశ్యంతో ’తెలంగాణ బ్రాండింగ్‌’ను చేపట్టారు. డిసెంబర్‌ 8, 9న జరిగే తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సదస్సులో ఈ లక్ష్యాలను ముందుకు తీసుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలనే కాకుండా, స్థానిక ప్రతిభ, వాణిజ్య అవకాశాలపై అలంకారంగా ఆలోచిస్తూ పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

డ్రగ్స్, సైబర్‌ నేరాలు, నిరుద్యోగ సమస్య…
బ్రాండింగ్‌ పనులను పక్కన పెట్టి చూస్తే, రాష్ట్రం తాజాగా ఎదుర్కొంటున్న అనేక సమస్యలు మిగిలాయి. డ్రగ్స్‌ వ్యాప్తి, సైబర్‌ నేరాలు, పెద్ద ఎత్తున మోసం కేసులు తీవ్ర ఆందోళనలు రేపుతున్నాయి. రూ.24 కోట్ల మోసాల ముఠా పట్టుబడడమే ఇందుకు నిదర్శనం. కానీ ఈ స్పష్టమైన సమస్యలపై ప్రభుత్వం ఆశించిన విధంగా ఫలితాలు కనిపించటం లేదని విమర్శలు ఉన్నాయి. అలానే, నిరుద్యోగ సమస్యలు, రైతుల సమస్యలు, నీటి వివాదాలు ఇంకా పూర్తి పరిష్కారం దరిచేరలేదు. ఈ సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడం అవసరమని, పెట్టుబడిదారుల ముందు ఈ సమస్యలు అవరోధాలుగా నిలబడకూడదని కంపెనీ వర్గాలు ప్రభుత్వానికి సూచిస్తున్నాయి.

ట్రిబ్యునల్‌ అవసరం
రాష్ట్ర అభివృద్ధిలో బ్రాండింగ్‌ కీలకపాత్ర పోషిస్తే, అంతేగాక నేరాలు, విద్యుత్, నీటి సమస్యలకు కూడా సమర్థవంతమైన పరిష్కారాలు తీసుకోవడం అంతర్జాతీయ పెట్టుబడిదారులకు నమ్మకాన్ని కలిగించడంలో కీలకమని తెలుస్తోంది. కేవలం పేరుతో తెలంగాణ ఎదగదు. సమస్యలపై కఠిన చర్యలు అవసరమని వివిధ రంగాల వారు అభిప్రాయపడుతున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper