HomeతెలంగాణRajiv Yuva Vikasam : రాజీవ్ యువ వికాసం' దరఖాస్తు ఎలా? అవసరమయ్యే పత్రాలు ఏవి?

Rajiv Yuva Vikasam : రాజీవ్ యువ వికాసం’ దరఖాస్తు ఎలా? అవసరమయ్యే పత్రాలు ఏవి?

Rajiv Yuva Vikasam : తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సంక్షేమ పథకాల ను స్పీడ్ చేసింది. గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన 6 గ్యారంటీలో భాగంగా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తోంది. వీటిలో ఇప్పటివరకు ఉచిత బస్సు, గ్యాస్ సబ్సిడీ, ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలను ప్రారంభించింది. అయితే యువత అభివృద్ధి లక్ష్యంగా.. వారి ఆర్థిక అభివృద్ధికి చేయూతను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘రాజీవ్ యువ వికాస్’ అనే పథకాన్ని ప్రారంభించింది. స్వయం ఉపాధి పొందాలనుకునే యువతకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి.. వాటిలో సబ్సిడీని అందించేందుకు ఈ పథకాన్ని ప్రారంభించింది. అయితే ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఈ పథకానికి ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం? ఎలా దీన్ని అప్లై చేయాలి?

Also Read : చెరో పదేళ్లు అధికారం.. కేటీఆర్ తో అసెంబ్లీలో కోమటిరెడ్డి డీల్!

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘రాజీవ్ యువ వికాసం’ దరఖాస్తులను తహసిల్దార్ కార్యాలయంలో ఇప్పటికే స్వీకరిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ యువత కు ఆర్థిక సాయం అందించేందుకు ప్రవేశపెట్టిన ఈ పథకంపై ఉన్న అపోహలను తొలగించేందుకు ప్రభుత్వం తాజాగా కొత్త మార్గదర్శకాలను అందించింది. వీటి ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారు వార్షిక ఆదాయంను రూ 1,50,000లను కలిగి ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో రూ.2,00,000 వార్షికాదాయాన్ని కలిగి ఉండాలి. అలాగే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నవారు ఆధార్ కార్డు, ఆదాయం సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం, పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్, పట్టాదారు పాసుపుస్తకం, వికలాంగులు అయితే సదరం సర్టిఫికెట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు వార్నబుల్ గ్రూపు సర్టిఫికెట్లు ఉంచాల్సి ఉంటుంది. కుటుంబంలో ఇప్పటికే ఎస్సీ ఎస్టీ లేదా బీసీ కమిషన్ ద్వారా రుణాన్ని పొందగలిగిన వారైతే వారు మరోసారి దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. అంతేకాకుండా ఒకే కుటుంబం నుంచి ఒక్కరు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

ఇరవై ఒక్క ఏళ్ల నుంచి 50 సంవత్సరాలు మధ్య ఉన్నవారు ఈ పథకం లబ్ధి పొందడానికి అర్హులు. అలాగే వ్యవసాయం దాని అనుబంధం రంగాలకు చెందిన వారికి 60 సంవత్సరాల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాజీవ్ వికాసం దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అనుకునేవారు https://pgo bmms.cgg.gov.in అనే పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ పై అవగాహన లేని వారు సమీప మీసేవ కేంద్రాల్లోకి వెళ్లాలి. ఏప్రిల్ 5 వరకు ఈ దరఖాస్తులను స్వీకరించి మే 31వ తేదీ వరకు వీటిని పరిశీలిస్తారు.

దరఖాస్తు చేసుకున్న వారి పత్రాలను జిల్లా స్థాయిలో సెలక్షన్ కమిటీ పరిశీలిస్తుంది. ఈ కమిటీకి కలెక్టర్ చైర్మన్ గా ఉంటారు. వీరు ఎంపిక చేసిన లబ్ధిదారులను జూన్ రెండవ తేదీన మంజూరు అత్తలను అందజేస్తారు. ఇలా జూన్ 9 వరకు ఈ పత్రాలను అందజేస్తారు. గ్రామాల వారు మండల స్థాయిలో అధికారుల నుంచి ఈ పత్రాలను పొందవలసి ఉంటుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 4200 మందికి లబ్ధి చేకూరి అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

Also Read : నకిరేకల్ పోలీస్ స్టేషన్ లో.. కేటీఆర్ పై కేసు నమోదు.. ఎందుకంటే….

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Delhi Protests

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...
Team India Bowling

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
OG 2 Animation Video

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...
KCR And Revanth Reddy

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Oktelugu Epaper