Fine Rice Scheme : తెలుగువారు ప్రత్యేకంగా జరుపుకునే ఉగాది పండుగ కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. తెలుగు క్యాలెండర్ ప్రకారం ఉగాది నుంచి కొత్త పనులు ప్రారంభిస్తారు. తెలుగు సంవత్సరం ఉగాది నుంచి ప్రారంభం అవుతున్నందున ఇప్పటి నుంచే కొన్ని ప్రభుత్వ పథకాలను కూడా ప్రారంభించాలని చూస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఈ ఉగాది నుంచి రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే ఉగాది రోజున సన్న బియ్యం పంపిణీని ఇక్కడ ప్రారంభిస్తారు అంటే?
Also Read : రాజీవ్ యువ వికాసం’ దరఖాస్తు ఎలా? అవసరమయ్యే పత్రాలు ఏవి?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. అనేక సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు. అయితే గత సంక్రాంతి నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత వాయిదా వేశారు. అయితే ఉగాది సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 1వ తేదీన హుజూర్నగర్ పట్టణంలో చిన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 91,19,269 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో 2,82,77,859 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ఒక్కొక్కరికి ఆరు కిలోల సన్న బియ్యం పంపిణీ చేసే విధంగా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలుపుతున్నారు. హుజూర్నగర్ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా దీనిని అమలు చేస్తారని అధికారులు తెలుపుతున్నారు.
ఇప్పటివరకు రేషన్ కార్డు ద్వారా దొడ్డు బియ్యం పంపిణీ చేశారు. అయితే ఈ బియ్యాన్ని చాలామంది రేషన్ కార్డు లబ్ధిదారులు తీసుకోవడం లేదు. కొందరు తీసుకున్న వెంటనే వాటిని విక్రయిస్తున్నారు. రేషన్ కార్డులో ఉన్న అక్రమాలను తొలగించేందుకే సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలుపుతున్నారు. సన్న బియ్యం పంపిణీ ద్వారా రేషన్ కార్డు బియ్యం అక్రమాలకు అడ్డుకట్ట వేయచ్చని అంటున్నారు.
పేదల కోసమే పంపిణీ చేసే సన్నబియ్యం పక్కదారి పడకుండా ఉండేందుకు పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని అంటున్నారు. ఇప్పటికే ఈ బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు ఎగుమతులు చేస్తుండగా పట్టుకున్నట్లు పేర్కొంటున్నారు. అధికారులు రేషన్ బియ్యం పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలుపుతున్నారు. అయితే రేషన్ షాప్ ల వద్ద ఈ సన్న బియ్యం కూడా పక్క దారి పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఉగాది కానుకగా ఈ బియ్యాన్ని పంపిణీ చేయడం వల్ల ఎంతోమంది పేదల్లో సంతోషం వెళ్లి విరుస్తుందని అంటున్నారు. అంతేకాకుండా సన్న బియ్యం పంపిణీ ద్వారా ప్రతి ఒక్కరూ వీటిని తీసుకుంటారని అంటున్నారు. మరోవైపు రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్న వారు తమ పేరు రాలేదని చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు రేషన్ కార్డు కేవలం సంక్షేమ పథకాల కోసం మాత్రమే ఉపయోగపడుతుందని అనుకున్నారు. కానీ సన్న బియ్యం పంపిణీ ద్వారా రేషన్ కార్డుకు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read : టెస్లాకు మించిన ఆ కారు ప్లాంట్ కోసం తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం…