HomeతెలంగాణKTR: మానవత్వం చాటుకున్న కేటీఆర్ మానవత్వం..ఎక్కడ.. ఎం జరిగిందంటే..?

KTR: మానవత్వం చాటుకున్న కేటీఆర్ మానవత్వం..ఎక్కడ.. ఎం జరిగిందంటే..?

KTR: మాజీ ఐటీ మినిస్టర్ కె.తారక రామారావు మానవత్వాన్ని చాటుకున్నారు. ఎప్పుడూ రాజకీయాలే కాదు అప్పుడప్పుడు ఇలాంటి పనులను కూడా ఆయన చేస్తుంటారు. గతంలోనూ కేటీఆర్ చాలాసార్లు మానవత్వాన్ని చాటుకున్నారు. కేటీఆర్ ప్రస్తుతం వరంగల్, ఖమ్మం,నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే ఆయన బుధవారం వరంగల్ నుంచి నర్సంపేట ఎన్నికల ప్రచారానికి బయలు దేరారు. అయితే కేటీఆర్ వరంగల్ కార్మిక నగర్ కు చేరుకోగానే అక్కడ యాక్సిడెంట్ అయిన విషయాన్ని గుర్తించారు. అంజయ్య అనే వ్యక్తి ఆ ప్రమాదంలో గాయపడిన విషయాన్ని చూశారు.

దీంతో వెంటనే స్పందించిన కేటీఆర్ అంజయ్యను తన కాన్వాయ్ లో ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రాణాపాయ స్థితిలో వున్న అంజయ్యను కేటీఆర్ సకాలంలో వరంగల్ ఎంజీఎంకు తరలించడంతో ఆయన ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. అంజయ్య కుటుంబీకులు కేటీఆర్ చేసిన సాయానికి ధన్యవాదాలు తెలిపారు. రాజకీయంగా అంతటి కీలకమైన బాధ్యతల్లో ఉండి.. ఎన్నికల ప్రచారంలో బిజీ షెడ్యూల్ లో ఉండి కూడా కేటీఆర్ అంజయ్యను కాపాడడంపై పలువురు హర్షం వ్యక్రం చేశారు.

వాస్తవానికి కేటీఆర్ గతంలోనూ పలుమార్లు ఇలాంటి మానవతను చాటుకునే కార్యక్రమాలు చేశారు. చిన్నపిల్లలకు హెల్త్ పరంగా సహకారం అందించడమే కాకుండా.. అప్పుడప్పుడు ఇలా ఎక్కడైనా.. యాక్సిడెంట్లు జరిగినా వారిని ఆస్పత్రులకు తరలించడం కెసిఆర్ కు పరిపాటే.

 

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular