Homeటాప్ స్టోరీస్Jubilee Hills By Poll Exit Polls: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు: ఎగ్జిట్ పోల్స్ బయటికి...

Jubilee Hills By Poll Exit Polls: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు: ఎగ్జిట్ పోల్స్ బయటికి వచ్చేసాయి.. గెలిచేది ఆ పార్టీనే

Jubilee Hills By Poll Exit Polls: తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ఉత్కంఠ కలిగించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు పూర్తయ్యాయి. గడిచిన కొద్దిరోజులుగా గులాబి, కషాయం, కాంగ్రెస్ పార్టీలు ఈ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేశాయి. మూడు పార్టీల కీలక నాయకులు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. గులాబీ పార్టీ అయితే సోషల్ మీడియాలో రెచ్చిపోయింది.. కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.. పలు న్యూస్ చానల్స్ కు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికలో వచ్చే ఫలితాన్ని తెలంగాణ ప్రజలు ఇచ్చే రెఫరెండం అని ఆయన పేర్కొన్నారు.

సుమారు నాలుగు లక్షలకు పైచిలుకు ఓటర్లు ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో మంగళవారం పోలింగ్ జరిగింది.. రహమత్ నగర్ నుంచి మొదలుపెడితే బోరబండ వరకు ఎన్నికల సంఘం అత్యంత కట్టుదిట్టంగా వ్యవహరించింది.. పోలింగ్ శాతం అధికారులు అంచనా వేసినట్టుగా నమోదు కాకపోయినప్పటికీ.. మంగళవారం పొద్దుపోయే వరకు పోలింగ్ జరిగింది. కొన్ని ప్రాంతాలలో కాంగ్రెస్, గులాబీ పార్టీ నాయకుల మధ్య గొడవలు జరిగాయి. రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు పరస్పరం ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేశారు. అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

పోలింగ్ ముగిసిన తర్వాత సుప్రీంకోర్టు మార్గ దర్శకాలకు అనుగుణంగా కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి.. ఇందులో మెజారిటీ సంస్థలు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గెలిచే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉందని స్పష్టం చేశాయి..

చాణక్య స్ట్రాటజీస్ అనే సంస్థ వెల్లడించిన ఎగ్జిట్ పోల్ లో కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశాలు 46%, గులాబీ పార్టీకి గెలిచే అవకాశం 41 శాతం, భారతీయ జనతా పార్టీకి ఆరు శాతం అవకాశం ఉందని పేర్కొంది.

పీపుల్స్ పల్స్ అనే సంస్థ కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశం 48%, గులాబీ పార్టీకి 41 శాతం, బిజెపికి ఆరు శాతం ఉందని తేల్చింది.

స్మార్ట్ పోల్ అనే సంస్థ కాంగ్రెస్ పార్టీకి 48.2, గులాబీ పార్టీకి 42.1 శాతం , భారతీయ జనతా పార్టీకి ఆరు శాతం గెలిచే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది.

నాగన్న సర్వే కాంగ్రెస్ పార్టీకి 47%, భారత రాష్ట్ర సమితికి 41 శాతం, బిజెపికి 8 శాతం గెలిచే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.

 

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular