HomeతెలంగాణJubilee Hills verdict: జూబ్లీహిల్స్‌ తీర్పు.. గెలుపోటముల ప్రభావం ఎవరిపై ఎంత?

Jubilee Hills verdict: జూబ్లీహిల్స్‌ తీర్పు.. గెలుపోటముల ప్రభావం ఎవరిపై ఎంత?

Jubilee Hills verdict: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు. విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ వాతావరణం తారస్థాయికి చేరుకుంది. పోలింగ్‌ అనంతరం విడుదలైన ఎగ్జిట్‌ పోల్స్‌ పార్టీ వార్‌ రూమ్‌లలో నూతన చర్చలకు దారితీశాయి. చాలా సర్వేలు కాంగ్రెస్‌ అభ్యర్థికి ఊతం ఇచ్చి, బీఆర్‌ఎస్‌కు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గెలుపోటములు ఎవరిపై ప్రభావం చూపుతాయన్న చర్చ కూడా జరుగుతోంది.

సియాసత్‌ ఎగ్జిట్‌ పోల్స్‌..
ప్రతిష్ఠాత్మక ఉర్దూ మీడియా సంస్థ ‘సియాసత్‌’ వెల్లడించిన అంచనా ప్రకారం కాంగ్రెస్‌ ఓటింగ్‌ శాతం 48గా, బీఆర్‌ఎస్‌ 42గా నమోదైంది. ఇదే సమయంలో ‘డెక్కన్‌ క్రానికల్‌’ మాత్రం బీఆర్‌ఎస్‌ వైపు మొగ్గుచూపింది. రెండు అంచనాలు భిన్నంగా ఉన్న నేపథ్యంలో తుది ఫలితాలను ఊహించడం కష్టతరంగా మారాయి. ఈసారి జూబ్లీహిల్స్‌లో ఓటింగ్‌ శాతం 50 దాటకపోవడం కీలకంగా మారింది. సాధారణంగా తక్కువ పోలింగ్‌ అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తుంది. వ్యతిరేకత ఉన్నప్పుడు ఎక్కువ ఓటింగ్‌ నమోదవడం విపక్షానికి అనుకూలంగా ఉంటుంది. తాజాగా పోలింగ్‌ కాంగ్రెస్‌ ఉత్సాహాన్ని బీఆర్‌ఎస్‌లో టెన్షన్‌ పెంచింది.

బీజేపీ ఉనికి పెద్దగా లేనట్లే..
ఈ ఉప ఎన్నికలో బీజేపీ నామమాత్రంగా పోటీ చేసినప్పటికీ, ప్రభావం పరిమితంగానే కనిపించింది. 2023లో 3.6 శాతం ఓటు పొందిన ఈ పార్టీ, ఈసారి 6 నుంచి 7 శాతం వరకు పెరగవచ్చని సర్వే సంస్థలు సూచించాయి. అయినా, ప్రధాన పోరు కాంగ్రెస్‌ మరియు బీఆర్‌ఎస్‌ మధ్యే సాగిందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

కాంగ్రెస్‌ను కాపాడిన ఎంఐఎం..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌ పోరులో తన వ్యక్తిగత ప్రతిష్ఠను పణంగా పెట్టారు. అజారుద్దీన్‌కు మంత్రిపదవి ఇచ్చిన నిర్ణయం కూడా వ్యూహాత్మకంగా భావిస్తున్నారు. ప్రత్యేకంగా ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఓవైసీతో రేవంత్‌ చర్చించి ముస్లిం ఓట్లు కాంగ్రెస్‌ వైపు మళ్లేలా చేశారు. గత ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్న నవీన్‌ యాదవ్‌ ఈసారి పోటీ చేయకపోవడం ఆ వ్యూహానికి అనుకూలమైంది.

కేటీఆర్‌ నాయకత్వానికి పరీక్ష
బీఆర్‌ఎస్‌ ఈ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మాగంటి సునీత అభ్యర్థిత్వం, ప్రచారం ఇవన్నీ కేటీఆర్‌ సమన్వయంతో జరిగాయి. అయితే ఫలితాలు ప్రతికూలంగా రాకుండా ఉండాలనే భయం పార్టీలో కనిపిస్తోంది. కేటీఆర్‌ భవిష్యత్‌ రాజకీయ భూమికను ఈ ఫలితం ప్రభావితం చేయవచ్చని పార్టీ వర్గాల అభిప్రాయం. ఓటమిని ముందే ఊహించిన గులాబీ బాస్‌ కేసీఆర్‌.. సునీతకు ఓటు వేయమని కనీసం ప్రకటన కూడా విడుదల చేయలేదు.

జూబ్లీహిల్స్‌లో ఇంతవరకు కాంగ్రెస్‌ విజయం సాధించిన సందర్భం లేదు. టీడీపీ, బీఆర్‌ఎస్‌లు మాత్రమే వరుసగా గెలిచాయి. ఈసారి కాంగ్రెస్‌ విజయవంతమైతే, రేవంత్‌రెడ్డి రాజకీయ బలం కొత్త దిశగా మార్పు అవుతుంది. ఇది భవిష్యత్తు తెలంగాణ రాజకీయ సమీకరణాలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular