తెలంగాణకు చెందిన చైతన్య పోలోజు మిసెస్ గ్లోబల్ షో టాపర్-2020 కీరిటాన్ని సొంతం చేసుకున్నారు. అమెరికాలో వర్చువల్ గా నిర్వహిస్తున్న మిసెస్ గ్లోబల్ షో పోటీల్లో హైదరాబాద్ కు చెందిన ఎన్నారై యువతి చైతన్య పోలోజు ఈ పోటీల్లో టాపర్ గా నిలిచింది. ఈ షోకు ప్రత్యేక అతిథిగా హాజరైన ప్రముఖ డిజైనర్ కీర్తి రాథోడ్ చైతన్య విజేతగా ప్రకటించారు. హైదరాబాదీ యువతి ప్రతిష్టాత్మకమైన కీరిటాన్ని సొంతం చేసుకోవడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ఇంటింటికీ నల్లా.. తెలంగాణనే నెంబర్ వన్
చైతన్య పోలోజు గ్లోబల్ షో టాపర్-2020 కీరిటాన్ని తాజాగా సొంతంగా చేసుకోగా.. 2019లో మిసెస్ భారత్ న్యూయార్క్ కీరిటాన్ని దక్కించుకొని సత్తాచాటింది. చైతన్య ప్రస్తుతం ప్రపంచ తెలుగు కల్చరల్ ఫెస్టివల్కు అందాల సుందరి కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్నారు. టాటావారి ‘తారల ఇంట్లో సందడి’ షోలో స్పెషల్ గెస్ట్గా వ్యవహరించారు. అంతేకాకుండా మై డ్రీం గ్లోబల్ ఫౌండేషన్ వర్జీనియా చాప్టర్ కో ఆర్డినేటర్ గా చైతన్య సేవలందిస్తున్నారు.
Also Read: భారతదేశంలోని టాప్ – 50 ఎమ్మెల్యేల లిస్టులో ఏపీ మహిళా నేత!
చైతన్య అందాల పోటీలతోనే కాకుండా.. అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్నారు. మోడలింగ్ రంగంలో రాణిసున్న చైతన్య సినిమాల్లో రాణించడమే తన లక్ష్యమని చెబుతోంది. 2019లో మిసెస్ భారత న్యూయార్క్.. 2020లొ మిసెస్ గ్లోబల్ షో టాపర్ కీరిటం దక్కడంపై ఆమె సంతోషం వ్యక్తం చేసింది. మోడలింగ్, అందాల పోటీల్లో రాణిస్తున్న తెలంగాణ యువతి చైతన్య వెండితెరపై త్వరలో మెరవడం ఖాయంగా కన్పిస్తుంది. సినిమాల్లో చైతన్య సత్తా చాటాలని ఆశిద్దాం.