KA Paul: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఎమ్మెల్యేలు వెన్నుపోటు పొడవబోతున్నారా? ఆయనను గద్దె దించేందుకు తెరవెనుక కుట్ర జరుగుతోందా.. ఎమ్మెల్యేలు అమ్ముడుపోవాలని చూస్తున్నారా.. అంటే అవుననే అంటున్నాడు కేఏ.పాల్ కాక.. రెండ రోజుల క్రితం ప్రపంచ శాంతి, ఆర్థిక సదస్సు కోసం సీఎం రేవంత్రెడ్డిని కలిసిన పాల్ బుధవారం రేవంత్కు మద్దతుగా సంచలన బాంబు పేల్చాడు. ఎన్టీరామారావుకు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడచినట్లు రేవంత్రెడ్డికి కూడా వెన్నుపోటు పొడవాలని నలుగురు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆ ప్రయత్నాలు మానుకోకుంటే గుండు గీస్తానని హెచ్చరించారు. రూ.100 కోట్ల నుంచి రూ.1000 కోట్లకు అమ్ముడు పోవాలనుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా అమ్ముడు పోతే.. వాళ్ల ఇంటికి వచ్చి తగలబెడతారని హెచ్చరించారు. సీఎంను కలిసిన రెండు రోజులకే కేఏ.పాల్ సంచనల వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో చర్చనీయాంశమైంది.
ఎవరా నలుగురు..?
కేఏ.పాల్ నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే రేవంత్కు వెన్నుపోటు పొడవాలని చూస్తున్నట్లు ఆరోపించారు. ఇప్పుడు ఎవరా నలుగురు అన్న చర్చ జరగుతోంది. ఆ నలుగురులో ఎవరైనా మంత్రులు ఉన్నారా.. సీఎం పీఠం ఆశిస్తున్న ఎమ్మెల్యేలు ఎవరు? అన్న చర్చ కూడా జరుగుతోంది. బీఆర్ఎస్తో సన్నిహిత సంబంధాలు ఉన్నది ఎవరని కూడా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే సీఎంవో సమాచారం లీక్ అవుతుందని గుర్తించిన సీఎం రేవంత్రెడ్డి, ఇటీవలే కేసీఆర్ వద్ద పనిచేసిన సిబ్బందిని పూర్తిగా మార్చేశారు. ఈ క్రమంలో కేఏ.పాల్ సంచలన బాంబు పేల్చడంతో అసలు ఏం జరుగుతుందన్న చర్చ జరుగుతోంది. కొంతమంది కేఏపాల్ సంచలనం కోసమే ఇలాంటి ఆరోపణలు చేసి ఉంటారని కొట్టిపారేస్తున్నారు. లైట్ తీసుకుంటున్నారు. కొందరు మాత్రం సీరియస్గానే ఆలోచిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Four congress leaders are trying to turn their backs on revanth reddy ka paul
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com