spot_img
HomeతెలంగాణCM Revanth Reddy Davos Tour: రేవంత్ రెడ్డి మంత్రుల దావోస్ టూర్.. ఈసారి ప్లాన్...

CM Revanth Reddy Davos Tour: రేవంత్ రెడ్డి మంత్రుల దావోస్ టూర్.. ఈసారి ప్లాన్ ఏంటి

CM Revanth Reddy Davos Tour: రేవంత్ రెడ్డి దూకుడు కొనసాగిస్తున్నారు. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నప్పటికీ.. సోషల్ మీడియా ద్వారా దాడి చేస్తున్నప్పటికీ.. సొంత మీడియాలో ఇష్టానుసారంగా కథనాలను ప్రసారం చేస్తున్నప్పటికీ రేవంత్ రెడ్డి ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. విమర్శలు చేయడంలోనూ తగ్గడం లేదు. పైగా బీఆర్ఎస్ గద్దెలను కూల్చాలని పిలుపునిస్తున్నారు. ఆ పార్టీని 100 మీటర్ల లోతులో పాతిపెట్టాలని స్పష్టం చేస్తున్నారు.

మేడారం జాతరలో భాగంగా అభివృద్ధి పనులను పరిశీలించి.. సమ్మక్క సారలమ్మకు మొక్కులు తీర్చుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సోమవారం సాయంత్రం దావోస్ వెళ్ళిపోయారు. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో పాల్గొనడానికి ఆయన మంత్రులతో కలిసి వెళ్లిపోయారు. దావోస్ ప్రాంతంలో తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు చేశారు. అక్కడ గూగుల్, యూనిలీవర్, హనీ వెల్, లోరెల్, నోవార్టీస్, సేల్స్ ఫోర్స్, టాటా గ్రూప్స్, డిపి వరల్డ్, సిస్కో, ఇన్ఫోసిస్ వంటి సంస్థల అధినేతలతో ముఖ్యమంత్రి వేరువేరుగా భేటీ అవుతారు. అంతర్జాతీయ ప్రతినిధులతో నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశాలలో కూడా ముఖ్యమంత్రి పాల్గొన్నారు..

చర్చలు, భేటీల తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు , స్థాపించిన సంస్థల విస్తరణ పై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అదృష్ట సార్ ఇస్తారు. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లైఫ్ సెండ్ చేసి ఉంటే రంగాలలో భారీగా పెట్టుబడులను తీసుకురావడమే తన లక్ష్యమని ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించారు. గత డిసెంబర్లో హైదరాబాదులో తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ ను ప్రభుత్వం నిర్వహించింది. ఆ సమయంలో విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించింది . మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని ప్రభుత్వం ఆ డాక్యుమెంట్ రూపొందించింది.

వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా తెలంగాణ శక్తిసామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా తెలంగాణ రైసింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను ప్రదర్శించాలని అధికారులకు ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్యమంత్రితో దావోస్ వెళ్ళిన వారిలో ఉన్నారు. ఈసారి కూడా భారీగా పెట్టుబడులను తీసుకొచ్చి తెలంగాణ సామర్ధ్యాన్ని ప్రపంచానికి చాటే విధంగా ముఖ్యమంత్రి రూపకల్పన చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Rhiya Ahir

Rhiya Ahir: 27 ఏళ్ల యువతి సాహసం.. ఒంటరిగా పోలీసు వ్యాన్‌ను అడ్డుకుని విద్యార్థులను విడిపించిన రియా అహిర్....

Rhiya Ahir: నేషనల్ స్థాయి పోటీ పరీక్షల్లో, ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వంటి సమస్యలపై ఢిల్లీలో మొదలైన విద్యార్థుల నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా...
Nile River History

Nile River History: వేల ఏళ్ల నాగరికత.. మూడు దేశాల మధ్య యుద్ధానికి కారణమైన నది!

Nile River History: నైలు నది కేవలం ఒక జలప్రవాహం కాదు. ఇది వేల సంవత్సరాలుగా ఒక మహా నాగరికతను పోషించిన, ఆకారం ఇచ్చిన, ఇప్పటికీ కోట్లాది మంది జీవనాధారంగా నిలిచిన ప్రకృతి...
Flying Humans

Flying Humans: పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు వస్తే..

Flying Humans: అప్పుడప్పుడు మనుషులు తమ ఊహలకు రెక్కలు తొడుగుతూ ఉంటారు. వాటిని ఏదో ఒక రూపంలో చూసుకుంటూ మురిసిపోతారు. కాకపోతే పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు ఉండవు. ఎందుకంటే మన శరీర...
SS Rajamouli

SS Rajamouli: రాజమౌళి ఘోస్ట్ డైరెక్టర్ గా చేసిన మూవీ ప్లాప్ అయిందా…

SS Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ప్రతి సినిమా అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టింది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి చేసిన అన్ని సినిమాలతో సక్సెస్ లను సాధించిన...
TTD

TTD: భక్తులకు టీటీడీ శుభవార్త.. ఇక తిరుమల భక్తుల కష్టాలు తీరినట్టే

TTD: కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మంచి వార్త అందించింది. పెద్ద మొత్తంలో విరాళాలు అందించి వీఐపీ బ్రేక్ దర్శనం పొందే...
Oktelugu Epaper