spot_img
HomeతెలంగాణRuna Mafi Survey : 50 శాతం రుణమాఫీ సర్వే పూర్తి.. రైతుల ఖాతాల్లోకి డబ్బులు...

Runa Mafi Survey : 50 శాతం రుణమాఫీ సర్వే పూర్తి.. రైతుల ఖాతాల్లోకి డబ్బులు ఎప్పుడంటే?

Runa Mafi Survey :  తెలంగాణ ప్రభుత్వం రైతులకు రుణ భారాన్ని తగ్గించేందుకు ‘రుణమాఫీ’ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. రూ. 2 లక్షల వరకు రైతులు తీసుకున్న రుణాన్ని మొత్తం ప్రభుత్వమే చెల్లించి వారికి భారాన్ని తగ్గించింది. తెలంగాణలో రూ. 2 లక్షల వరకు రుణం తీసుకున్న వారి కోసం ప్రభుత్వం రూ.31 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపింది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు తీసుకున్న వారు, రెన్యూవల్ చేసుకున్న వారికి ఇది వర్తిస్తుంది. అయితే ఆగస్టు 15న రూ. 2 లక్షల రుణ మాఫీ ప్రకటించిన తరువాత కొంత మందికి ఇది వర్తించలేదు. వివిధ కారణాల వల్ల వారికి రుణ సాయం అందలేదు. ఈ నేపథ్యంలో రైతులు ఆందోళన చేశారు. కొన్ని చోట్ల ధర్నాలు, రాస్తారోకోలు చేయడంతో ప్రభుత్వం అర్హులై ఉండి, రుణ మాఫీ కాని వారి కోసం సర్వే చేపట్టింది. ఈ సర్వే ఇటీవల 50 శాతం పూర్తయింది. అయితే ఆ తరువాత ఏం చేయబోతుందంటే?

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రూ.2 లక్షల రుణమాఫీకి అర్హులై ఉన్న దాదాపు 4 లక్షల మందికి రుణ సాయం అందలేదు. వీరి కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ఇంటింటికి రుణమాఫీ కాని వారి ఇంటింటికి వెళ్లి సర్వే చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సంబంధిత అధికారులు రైతుల ఇళ్లల్లోకి వెళ్లి వారి వివరాలను సేకరించారు. వారికి రుణ మాఫీ కాకపోవడానికి కారణాలేంటో తెలుసుకున్నారు. ఆ తరువాత వివారాలను ప్రభుత్వానికి అందజేశారు.

సర్వే పూర్తయిన తరువాత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తన్నారు. ఇప్పటి వరకు రుణమాఫీ కాని వారిలో రేషన్ కార్డులు లేనివారు, పేర్లలో తప్పులు ఉన్నవారు, ఐటీ చెల్లించిన వారు ఉన్నారు. అయితే ప్రభుత్వం రుణ మాఫీకి అర్హులై ఉండి ఏమైనా తప్పులు ఉంటే వాటిని సరిచేస్తామని తెలిపింది. అందులో భాగంగానే ఈ సర్వే చేపట్టామని పేర్కొంది. ప్రస్తుతం ఈ సర్వే 50 శాతం పూర్తయినందున చిన్న చిన్న పొరపాట్లు ఉన్నవారి ఖాతాల్లో త్వరలో రుణ మాఫీ సాయం అందనున్నట్లు తెలిపింది.

ఇదిలా ఉండగా కొంత మంది రూ.2 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో రుణం తీసుకున్నవారికి సైతం రుణ సాయం అందజేస్తామని తెలిపింది. అయితే రూ. 2 లక్షల కంటే ఎక్కువ ఎంత మొత్తం ఉంటుందో.. ఆ మొత్తాన్ని బ్యాంకులకు చెల్లిస్తే రూ. 2 లక్షల వరకు రుణ మాఫీ చేస్తారని తెలపింది. వీరి వివరాలను కూడా ప్రభుత్వం సేకరించినట్లు సమాచారం. దీంతో రూ. 2 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో రుణం తీసుకున్న వారికి కూడా ప్రయోజనం కలగనుంది.

రూ. 2 లక్షల రుణ మాఫీలో భాగంగా ముందుగా రూ. లక్ష వరకు మాఫీ చేశారు. ఆ తరువాత రూ. 1.50 వేలు బ్యాంకుల్లో జమ చేశారు. ఆగస్టు 15న రూ. 2 లక్షల రుణం తీసుకున్న వారికి ఆ మొత్తాన్ని అందజేశారు. అయితే చాలా మంది తమ ఖాతాలను కేవైసీ అప్డేట్ చేసుకోకపోవడంతో పాటు పేర్లలో తప్పులు ఉండడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయని బ్యాంకు అధికారులు తెలుపుతున్నారు. రైతులు నేరుగా బ్యాంకుకు వెళ్లి వారి సమస్య పరిష్కారం కోసం అధికారులను కలవాలని అంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Oktelugu Epaper