
కేసీఆర్ ప్రభుత్వ అక్రమాలపై కోర్టులను ఆశ్రయిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. నేడు ఆయన ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేశారు. కేసీఆర్ అవినీతి చిట్టా తమ చేతిలోనే ఉందన్నారు. రిజిస్ట్రేషన్ల నిలిపివేతతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల అక్రమాలు, అవినీతిని బయటపెడతామన్నారు. కేసీఆర్ అవినీతిపై సాక్ష్యాలతో సహా కోర్టులో పిటిషన్ వేస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు.