ఏలూరులో వింత వ్యాధి బాధితులకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాధితులకు అసలేం జరిగిందో పరిశీలించాలన్నారు. అవగాహన లేకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని విమర్శించారు. ఏలూరు ఘటనను మొదట వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదని, కారణాలు తెలియవని వాదించడం ప్రభుత్వ వితండవాదమే అవుతుందని ఆయన అన్నారు.