హైదరాబాద్లో ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు రూ. లక్ష.. పాక్షికంగా దెబ్బతింటే రూ. 50 వేలు ఇస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ ప్రజల కోసం తక్షణమే రూ.550 కోట్లు మంజూరు చేస్తున్నామన్నారు. ఈ నిధులు మున్సిపల్ శాఖకు బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే వరద నీటికి ప్రభావానికి గురైన ప్రతి ఇంటికి రూ. 10 వేలు ఇస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని, వారందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.