హైదరాబాద్లో ఆక్రమణల కట్టడాల తొలగింపు మొదలైంది. రెండు రోజులుగా భారీ వర్షాలతో వరదలతో హైదరాబాద్ నగరంలో తడిసి ముద్దయింది. ఈ నేపథ్యంలో చెరువులు, నాలాల ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతోనే ఈ పరిస్థితి ఎదురైందని పలువురు ఆరోపించారు. అలాగే మల్కాజ్గిరి ప్రాంతంలో పర్యటించిన ప్రజాప్రతినిధులకు ఆక్రమణ నిర్మాణాలను తొలగించాలని డిమాండ్ చేశారు దీంతో శనివారం మల్కాజ్గిరితో పాటు పటేల్నగర్లో నాలాలపై ఉన్న ఆక్రమ కట్టడాలను అధికారులు ఎక్స్కవేటర్లతో కూల్చివేస్తున్నారు.