ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్క్లూజివ్ అనే మూడు విధానాలతో అభివృద్ధిలో భాగస్వాములవుతున్నామని తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. శుక్రవారం పబ్లిక్ అఫైర్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా (పీఏఎఫ్ఐ) ఆధ్వర్యంలో జరిగిన ప్లీనరీలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆర్థిక, పారిశ్రామక రంగాల్లో పురోగతి సాధిస్తే ఏ రాష్ట్రమైన అభివృద్ధి సాధిస్తుందని అన్నారు.