వానకాలంలో సాగుచేసిన పంటల కోనుగోలుపై శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. గతేడాది ఎంత పంట వేశారు..? వాటికి ఎంత ధర వచ్చింది..? అనే విషయాలపై నివేదిక తీసుకురావాలని అధికారులకు ఇదివరకే సూచించారు. అలాగే యాసంగిలో వేసే పంటలపై కూడా సీఎం చర్చించనున్నారు. ముఖ్యంగా మక్కల సాగుపై విధానపరమైన నిర్ణయం తీసుకోనున్నారు. దేశంలో మక్కల పరిస్థితి ఏంటి..?తదితర అంశాలపై చర్చించనున్నారు.