
తెలంగాణలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంగళవారం విడుదల చేసిన బులిటెన ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 837కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే నలుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,32,671 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,315గా ఉన్నట్లు బులిటెన్లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,13,466 మంది కోలుకోగా ప్రస్తుతం 17,890 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 14,851 ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు.