బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లపై చూపుతోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మహబూబ్నగర్ జిల్లలోని జూరాల ప్రాజక్టుకు భారీగా వరదనీరు చేరింది. దాదాపు లక్షా 96వేల క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో ఉండడంతో అధికారులు జూరాల ప్రాజెక్టు 25 గేట్లను ఎత్తారు. లక్షా 70 వేల క్యూసెక్కులను నదిలోకి వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,045 అడుగులు కాగా ప్రస్తుతం 1024గా ఉంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టుకు వరదపోటు తీవ్రమవడంతో బుధవారం 7 గేట్లను 10 అడుగుల మేర ఎత్తారు. రెండు, మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు జలశయానికి 69,901 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.80 అడుగుల మేరకు నీరు చేరింది. మరోవైపు