Space Travel: అంతరిక్షంలోకి సాధారణ పౌరులను పంపేందుకు అగ్రరాజ్యాం అమెరికా ప్రాజెక్టు సిద్ధం చేస్తోంది. ఆ దేశానికి చెందిన స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ(సెరా) ఈమేరకు ఒక ప్రాజెక్టును చేపట్టింది. అంతరిక్ష ప్రయోగాలు చేసే సామర్థ్యం లేని దేశాల పౌరులను ఈ ప్రాజెక్టు ద్వారా అంతరిక్షంలోకి పంపనున్నారు. ఈమేరు బ్లూ ఆరిజిన్ సంస్థతో సెరా ఒప్పందం చేసుకుంది. బ్లూ ఆరిజిన్ రూపొందించిన న్యూ షెపర్డ్ వ్యోమనౌకలో ఈ యాత్ర జరుగుతుంది. భవిష్యత్లో చేపట్టబోయే మొదటి ప్రయాణం కోసం వ్యోమనౌకలో మొత్తం ఆరు సీట్లు సెరా కోసం రిజర్వు చేశారు. ప్రపంచంచ వ్యాప్తంగా సాధారణ పౌరులకూ వ్యోమగాములుగా ఎదిగే అవకాశం కల్పించేందుకు ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు సెరా తెలిపింది.
వ్యోమగాములు లేని దేశాలు 150..
ప్రపంచ వ్యాప్తంగా 150 దేశాల్లో వ్యోమగాములు లేరని సెరా తెలిపింది. ఈ పరిస్థితిని మార్చేందుకు ఆ దేశాల పౌరులను అంతరిక్షంలోకి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు సెరా సహ వ్యవస్థాపకుడు జాషువా స్కుర్లా తెలిపారు. 2022లో బ్రెజిల్కు చెందిన సివిల్ ఇంజినీరు విక్టర్ హెస్పాన్హాను ఎంపిక చేసి బ్లూ ఆరిజిన్ వ్యోమనౌక ద్వారా రోదసీలోకి పంపించామని చెపాపరు. బ్రెజిల్ తరఫున రోదసీలోకి వెళ్లిన రెండో వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారన్నారు. అంతరరిక్షరంగంలో ఉన్న అవకాశాలపై ఒక దేశం మొత్తాన్నీ ఒక వ్యక్తి ఎలా ప్రభావితం చేయగలరన్నది విక్టర్ యాత్ర ద్వారా తెలిసిందన్నారు. భవిష్యత్లో అంతరిక్షంలో మానవ జీవనం, పుడమిపై ఉన్న వైవిధ్యాన్ని ప్రతిబింబించాలని న్యూ షెపర్డ్ బిజినెస్ వైస్ప్రెసిడెంట్ ఫిల్ జాయ్స్ తెలిపారు. వ్యోమ నౌకలో రిజర్వు చేసిన ఆరు సీట్లలో ఐదింటిని ఒక్క వ్యోమగామి లేని దేశాలకు కేటాయిస్తామన్నారు. ఆరో సీటు ఏ దేశానికి చెందన వ్యక్తి అయినా ఆశించొచ్చని పేర్కొన్నారు. ప్రతీ దేశానికి అంతరిక్ష సంస్థ ఉండేలా చూడడం తమ ఉద్దేశమని సెరా తెలిపింది.