Homeట్రెండింగ్ న్యూస్Batteries : వచ్చేస్తున్నాయి పేపర్ బ్యాటరీలు.. వీటిని ఎలా తయారు చేస్తారంటే..

Batteries : వచ్చేస్తున్నాయి పేపర్ బ్యాటరీలు.. వీటిని ఎలా తయారు చేస్తారంటే..

Batteries : స్మార్ట్ పరికరాలు బ్యాటరీ ఆధారంగా పనిచేస్తాయి. అంటే మనం బ్యాటరీని ఛార్జ్ చేస్తే.. అవి మనకు ఉపయోగపడుతుంటాయిస్మార్ట్ పరికరాలు పనిచేయాలంటే బ్యాటరీ కచ్చితంగా ఉండాలి. ఈ బ్యాటరీని లిథియం, కోబాల్ట్ వంటి ఖనిజాలు ఉపయోగించి చేస్తుంటారు. అయితే వీటివల్ల పర్యావరణానికి తీవ్రస్థాయిలో హాని కలుగుతుంది. బ్యాటరీలు తయారు చేయడానికి లిథియం, కోబాల్ట్ వంటి ఖనిజాలను భారీగా ఉపయోగించాల్సి ఉంటుంది.. అందుకోసం భూమిలో తవ్వకాలు చేపట్టాల్సి ఉంటుంది. అయితే ఆ ఖనిజాలు అత్యంత విలువైనవి, అందులోనూ అరుదైనవి కాబట్టి.. వాటి అన్వేషణ కోసం తీవ్రంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వాటి ఆనవాళ్లు భూమిలో లభించినప్పటికీ.. వాటిని తవ్వడానికి.. శుద్ధి చేయడానికి చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది. పైగా ఇదంతా కూడా పర్యావరణానికి తీవ్రస్థాయిలో ఇబ్బంది కలిగిస్తుంది.. ఇక బ్యాటరీల వినియోగంలో లిథియం, కోబాల్ట్ వాడకం వల్ల పర్యావరణ కాలుష్యం కూడా తీవ్రస్థాయిలో ఉంటుంది. అయితే ఈ సమస్య పరిష్కారానికి సింగపూర్ ప్రాంతానికి చెందిన ప్లింట్ అనే ఓ స్టార్టప్ కంపెనీ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది.. పెరుగుతున్న కాలుష్యం.. భూగర్భం మీద అధికమవుతున్న ఒత్తిడిని గమనించి.. తెరపైకి కాగితపు బ్యాటరీలను తీసుకొచ్చింది.

Also Read : ఒక్కసారి చార్జింగ్‌ పెడితే.. ఈ ఫోన్ 50 ఏళ్లు నడుస్తూనే ఉంటుంది!

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ..

కాగితపు బ్యాటరీలు.. పేరు వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ.. భవిష్యత్తు కాలంలో ఇవే స్మార్ట్ పరికరాలకు ఆధారంగా ఉండబోతున్నాయి. పేపర్ బ్యాటరీలో తిరిగి వినియోగించడానికి వీలుగా ఉండే సెల్యులోజ్ ఉపయోగిస్తారు. ఈ బ్యాటరీలు అత్యంత ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. వీటిని తిరిగి చార్జ్ చేసుకోవచ్చు. వీటి తయారీకి పెద్దగా ఖర్చు కాదు. పైగా ఫ్యాక్టరీగా తయారిలో సహజంగా కూలిపోయే పదార్థాలను ఉపయోగిస్తారు. ఒకవేళ ఆ బ్యాటరీల కాలం చెల్లిపోతే.. కొంతకాలంలోనే అవి భూమిలో బయో డీగ్రేడ్ అవుతాయి. ఇన్ని పర్యావరణ అనుకూల ఫీచర్లు ఉన్నాయి కాబట్టి.. కాగితపు బ్యాటరీకి ఇటీవల CES సస్టైనబులిటీ అవార్డు వచ్చింది. ఇక భవిష్యత్తు కాలంలో స్మార్ట్ పరికరాలలో ఉపయోగించడానికి పేపర్ బ్యాటరీలను తయారుచేస్తుంది ప్లింట్ సంస్థ. కాదు పోర్టబుల్ మొబైల్స్ మాదిరిగానే.. మడత పెట్టే బ్యాటరీలు కూడా తయారు చేసేందుకు ఈ సంస్థ ప్రణాళికలు రూపొందిస్తోంది..” స్మార్ట్ పరికరాల తయారీకి బ్యాటరీలు చాలా అవసరం. బ్యాటరీల తయారీలో లిథియం, కోబాల్ట్ విపరీతంగా వాడాలి. దీనివల్ల భూగర్భంపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతోంది. దీనికి తోడు కాలుష్యం కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఇదంతా జరగకూడదు అనుకుంటే.. పేపర్ బ్యాటరీలు కచ్చితంగా అందుబాటులోకి రావాలి. అప్పుడే పర్యావరణం బాగుంటుంది. లేకపోతే వీటివల్ల కాలుష్యం చెప్పలేని స్థాయిలో పెరిగిపోతుందని” పర్యావరణవేత్తలు అంటున్నారు. వచ్చే కాలంలో పేపర్ బ్యాటరీలు మాత్రమే కాకుండా.. పర్యావరణహితమైన ఉత్పత్తులు తయారు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని ప్లింట్ సంస్థ చెబుతోంది.

Also Read : ల్యాప్ టాప్ బ్యాటరీ అయిపోతుందా? ఇలా చెక్ చేసుకోండి

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular