IND vs ENG 3rd Test: ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇప్పటికే రెండు టెస్ట్ మ్యాచ్ లు ముగిశాయి. ఇక రెండు టీములు కూడా చెరొక విజయాన్ని నమోదు చేసుకొని 1-1 తో సమం అవగా, మూడో టెస్ట్ మ్యాచ్ రాజ్ కోట్ వేదిక జరగనుంది. ఇక బిసిసిఐ ఇంకా టీమ్ ని అనౌన్స్ చేయలేదు. అయితే బిసిసిఐ ఈ సిరీస్ లో మొదటి రెండు టెస్ట్ మ్యాచ్ లకు మాత్రమే టీమ్ ని అనౌన్స్ చేసింది. ఇక మిగితా మూడు టెస్ట్ లకి ఆ మ్యాచ్ లు ముగిశాక అనౌన్స్ చేస్తానని చెప్పింది.
ఇక అందులో భాగంగానే ఇప్పుడు రెండు టెస్ట్ మ్యాచ్ లు ముగిసినప్పటికీ ఇంకా కూడా బిసిసిఐ మిగిలిన మూడు మ్యాచ్ లకు ప్లేయర్లను సెలెక్ట్ చేయకపోవడం వెనక అసలైన కారణం ఏంటి అనేది ఎవరికి అర్థం కావడం లేదు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం సీనియర్ ప్లేయర్ అయిన విరాట్ కోహ్లీ నుంచి ఇంకా బీసీసీఐకి ఎలాంటి కబురు అందడం లేదు. ఆయన మొదటి రెండు టెస్ట్ మ్యాచ్ లకు మాత్రమే దూరం అవుతానని చెప్పి బిసిసిఐ దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. ఇక అందులో భాగంగానే ఇప్పుడు తను టీమ్ లో ఆడడానికి రెడీగా ఉన్నాడా లేదా అనే విషయం మీద క్లారిటీ అయితే రాలేదు.
అయితే కోహ్లీ మొదటి రెండు టెస్ట్ మ్యాచ్ లకు దూరం అవడానికి అసలైన కారణం ఏంటో ఎవరికి తెలియదు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం కోహ్లీ అనుష్క దంపతులు రెండో బిడ్డకు జన్మనివ్వనున్న నేపథ్యంలో తన ఫ్యామిలీతో కొద్ది రోజులు గడపాలనే ఉద్దేశ్యం లోనే ఆయన రెండు టెస్ట్ మ్యాచ్ లకు దూరమైనట్టుగా సమాచారం అందుతుంది. ఇక మొదటి టెస్ట్ మ్యాచ్ లో గాయపడిన కే ఎల్ రాహుల్, రవీంద్ర జడేజా రెండో టెస్ట్ మ్యాచ్ కు దూరమయ్యారు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం వీళ్లిద్దరూ గాయం నుంచి కొలుకుంటున్నట్టు గా తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళు బెంగళూరులోని ఎన్ సీ ఏ లో ఉన్నట్టు గా తెలుస్తుంది…
ఇక ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజుల నుంచి టెస్టుల్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్న శ్రేయస్ అయ్యర్ కి మిగితా మ్యాచ్ ల్లో అవకాశం దక్కడం కష్టంగానే కనిపిస్తుంది. అలాగే రజత్ పటిదార్ కూడా నెక్స్ట్ మ్యాచ్ లో చోటు సంపాదించుకున్నప్పటికీ, రెండు ఇన్నింగ్స్ లలో కూడా ఏమాత్రం తన సత్తా చాటుకోలేకపోయాడు…ఇక ఈ రెండు రోజుల్లో మిగతా మూడు మ్యాచ్ లకు సంబంధించిన పూర్తి టీమ్ ను అనౌన్స్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది…