AB De Villiers: కోహ్లీ తండ్రి కాబోతున్నాడని, అందుకే స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన మొదటి రెండు టెస్టులకు దూరమయ్యాడని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ.డివీలియర్ ఇటీవల తన యూట్యూబ్ చానెల్లో ప్రకటించారు. తాజాగా ఆ మాటలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈమేరకు కోహ్లికి క్షమాపణలు చెప్పాడు.
కోహ్లి ఎంపికపై సందేహాలతో..
భారత్ – ఇంగ్లండ్ టెస్టు సిరీస్లో తొలి రెండు టెస్టులకు కోహ్లి దూరమయ్యాడు. మిగతా మ్యాచ్లకు కింగ్ అందుబాటులో ఉంటాడా లేదా అన్నచర్చ జరుగుతోంది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ప్లేయర్, విరాట్ సన్నిహితుడు డివిలియర్స్ సంచలన విషయం తన యూట్యూబ్ చానెల్ ద్వారా వెల్లడించాడు. విరాట్ కోహ్లి – అనుష్క దంపతులు తమ రెండో బిడ్డ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ వ్యాఖ్యలపై విరాట్ కుటుంబం గానీ, బీసీసీఐ గానీ స్పందించలేదు.
సారీ చెప్పిన డివిలియర్స్..
అయితే, తాజాగా విరాట్కు డివిలియర్స్ సారీ చెప్పాడు. కోహ్లి విషయంలో తాను ఇదివరకు చెప్పిన విషయంలో నిజం లేదని పేర్కొన్నాడు. తప్పుడు ప్రచారం చేసినందుకు క్షమాపణలు అడుగుతున్నానని వెల్లడించాడు. ‘నేను నా యూట్యూబ్ షోలో చెప్పినట్లు కచ్చితంగా కుటుంబమే మొదటి ప్రాధాన్యత. అలాగే, నేను అదే సమయంలో ఘోరమైన తప్పు చేశాను.. అవును, తప్పుడు సమాచారాన్ని పంచుకున్నాను.. ఇది ఎంతమాత్రం నిజం కాదు. ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. నేను చేయగలిగిందల్లా అతనికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. విరాట్ను అనుసరించే.. అతని క్రికెట్ను ఆస్వాదించే ప్రపంచం మొత్తం అతనికి శుభాకాంక్షలు తెలపాలని నేను అనుకుంటున్నాను.. ఈ విరామానికి కారణం ఏదైనా సరే. అతను మరింత బలంగా, మెరుగ్గా, ఆరోగ్యంగా, తాజాగా తిరిగి వస్తాడని ఆశిస్తున్నా’ అని దక్షిణాఫ్రికా డివిలియర్స్ ఎక్స్లో ఓ వీడియో పోస్టు చేశాడు.
Family comes first and then Cricket. I made a terrible mistake, sharing false information which was not true at all, no one knows what’s happening with Virat Kohli : AB De Villiers#ViratKohli #ABDevilliers #AnushkaSharma #Sorry pic.twitter.com/FP6gsm0kwm
— mahe (@mahe950) February 9, 2024