spot_img
Homeక్రీడలుక్రికెట్‌Vaibhav Suryavanshi : రికార్డు లెవెల్ లో 50 కొట్టినా.. బుడ్డోడిని ఏడిపించారు.. ఇదేం న్యాయం..

Vaibhav Suryavanshi : రికార్డు లెవెల్ లో 50 కొట్టినా.. బుడ్డోడిని ఏడిపించారు.. ఇదేం న్యాయం..

Vaibhav Suryavanshi : వరుసగా ఆరు ఓటముల తర్వాత టీమ్ ఇండియా మళ్లీ విక్టరీ ట్రాక్ ఎక్కింది.. జింబాబ్వే జట్టుతో జరుగుతున్న మూడు టి20 మ్యాచ్ సిరీస్ లో.. తొలి మ్యాచ్లో విజయం సాధించింది. అది కూడా 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ అందుకుంది. ఈ మ్యాచ్లో వండర్ కిడ్ వైభవ్ సూర్య వంశీ అదరగొట్టాడు. మెరుపు వేగంతో బ్యాటింగ్ చేశాడు. జింబాబ్వే బౌలింగ్ మొత్తాన్ని కోశాడు. సూపర్ బ్యాటింగ్ తో టీమ్ ఇండియాకు అద్భుతమైన విజయాన్ని అందించాడు.

చేజింగ్ లో 126 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి సాధించింది. టీమిండియా చేజింగ్ మొదలు పెట్టినప్పుడు.. ప్రమాదకరమైన ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యారు. ఈ మైదానంలో బంతి ఊహించని విధంగా తిరుగుతోంది. పైగా వికెట్ల మీదికి వస్తోంది. దీంతో పరుగులు తీయడం కష్టంగా మారింది.. ఈ దశలో సూర్య వంశీ ఏమాత్రం భయపడలేదు. 14 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అతడు.. రాకెట్ వేగంతో హాఫ్ సెంచరీ చేశాడు. తద్వారా టీమిండియాలో గెలుపు తీరాలకు చేర్చాడు.

రాకెట్ వేగంతో హాఫ్ సెంచరీ చేసినప్పటికీ వైభవ్ సూర్య వంశీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ రాలేదు. ఆ పురస్కారం మయాంక్ యాదవ్ కు ఇచ్చారు. ఎందుకంటే భారత్ గెలవడానికి కృషి చేసింది మయాంక్ యాదవే. అతడు అద్భుతంగా బౌలింగ్ వేయడంతో జింబాబ్వే జట్టు చుక్కలు చూసింది. దాదాపు రెండు సంవత్సరాల విరామం అనంతరం అంతర్జాతీయ క్రికెట్లోకి అతడు ఎంట్రీ ఇచ్చాడు.. ఇతడు తొలి బంతికే ప్రమాదకరమైన ఆటగాడు బ్రియాన్ బెన్నెట్ ను అవుట్ చేసాడు. నాలుగుఓవర్లు వేసిన మయాంక్ కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు. రెండు వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఇతడు ఏకంగా 14 డాట్ బాల్స్ వేయడం విశేషం. హరారే మైదానం మీద జింబాబ్వేను అతడు 125 పనులకే పరిమితం చేయడం విశేషం. ఇంత తక్కువ స్కోరును ఫినిష్ చేయడం వైభవ్ సూర్య వంశీ కి ఈజీగా మారింది. బ్యాటింగ్ చేయగలిగాడు. బుుడ్డోడి బ్యాటింగ్ బాగున్నప్పటికీ.. టీమిండియా గెలుపుకు దోహదం చేసింది మాత్రం ముమ్మాటికి మయాంక్ యాదవ్. పురస్కారం లభించింది.

రికార్డు లెవెల్ లో సూర్య వంశీ బ్యాటింగ్ చేసి టీమిండియాను గెలిపించినప్పటికీ.. రెండు వికెట్లు పడగొట్టిన మయాంక్ యాదవ్ వైపే నిర్వాహకులు మొగ్గు చూపారు. అతడికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం అందించారు. ఈ నేపథ్యంలో సూర్య వంశీ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. గొప్పగా ఆడినప్పటికీ పురస్కారం ఇవ్వకుండా బుడ్డోడిని ఏడిపిస్తున్నారంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper